నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - నవంబర్ 29 : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం రేవూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులను వృత్తి విద్య కోర్సులో భాగంగా వారి పాఠ్యాంశం సంబంధించి ఆత్మకూరు పట్టణంలోని షాపింగ్ కాంప్లెక్స్, పలు వ్యాపార సముదాయాలలో క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు.. రేవూరు హైస్కూల్ హెడ్మాస్టర్ వెంకటేశ్వర్లు గారి సూచనలతో పాఠశాల ఉపాధ్యాయులైన ఫిజికల్ సైన్స్ (PS) ఉపాధ్యాయులు రత్నారెడ్డి, ఒకేషనల్ కోర్స్ అధ్యాపకులు రవిశంకర్ మరియు భాస్కర్ తో పాటు పాఠశాలకు చెందిన 9, 10వ తరగతి విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు....విద్యార్థులకు వారి పాఠ్యాంశంలో భాగంగా షాపింగ్ మాల్స్ లోని వ్యాపారాల తీరు, పలు వస్తువుల తయారీ అమ్మకాలు అనే అంశాలపై స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు పట్టణంలోని సూపర్ మార్కెట్ మరియు ఇతర షాపులను విద్యార్థులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటి వివరాలను నమోదు చేసుకున్నారు.. విద్యార్థులు క్షేత్రస్థాయిలో ఈ పరిశీలన వల్ల వీరికి వ్యాపార వ్యవహారాలయొక్క అవగాహన కల్పించడంతో వారి విద్యాభివృద్ధికి ఉపయోగపడేల ఈ షాపులను పరిశీలించడం జరిగిందని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు తెలిపారు
Admin
Namitha News