Wednesday, 17 June 2026 03:01:38 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

దార్శనిక నేత,అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి చంద్రబాబు - టిడిపి నేతలు కట్టా దొరస్వామి నాయుడు,నాగూర్ వలి ప్రశంసలు

Date : 20 April 2026 08:32 PM Views : 149

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : దార్శనిక నేత,అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి చంద్రబాబు - టిడిపి నేతలు కట్టా దొరస్వామి నాయుడు,నాగూర్ వలి ప్రశంసలు - ములకలచెరువులో ఘనంగా సిబిఎన్ పుట్టినరోజు వేడుకలు మదనపల్లె : దార్శనిక నేత,అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని టిడిపి నేతలు పేర్కొన్నారు.తంబళ్లపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కట్టాదొరస్వామి నాయుడు ఆధ్వర్యంలో సోమవారం ములకలచెరువులో సీఎం చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనం జరుపుకున్నారు.ఈ వేడుకులకు తంబళ్లపల్లి నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ సాయినాథ్,మదనపల్లి ఆర్టీసీ 1,2 డిపోల గౌరవ అధ్యక్షులు నాగూర్ వలి (షో ఆప్ శీనా),హరినాథ్ రావు,లక్ష్మీనారాయణ,పాలగిరి సిద్ధా తదితరులు హాజరయ్యారు.ఇందులో భాగంగా కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా దొరస్వామి నాయుడు,నాగూర్ వలిలు మాట్లాడుతూ 76 సంవత్సరాల వయసులోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి,ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు.ఆయన విజన్ దేశానికి ఆదర్శమని కొనియాడారు.ఓవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తూ ఓ యువకుడిలా ఆయన కనబరుస్తున్న పనితీరు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు.ఆయన సారధ్యంలో ఏపీ అన్నిరంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోందన్నారు.ముఖ్యంగా ఆంధ్రుల జీవనాడి పోలవరం,ప్రజా రాజధాని అమరావతి శరవేగంగా జరుగుతున్నాయన్నారు.తన తనయుడు మంత్రి నారా లోకేష్ బాబుతో కలిసి నవ్యాంధ్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు.ఆ భగవంతుడి ఆశీస్సులతో ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని,రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మరికొన్ని సంవత్సరాలు కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున టిడిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :