నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : దార్శనిక నేత,అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి చంద్రబాబు - టిడిపి నేతలు కట్టా దొరస్వామి నాయుడు,నాగూర్ వలి ప్రశంసలు - ములకలచెరువులో ఘనంగా సిబిఎన్ పుట్టినరోజు వేడుకలు మదనపల్లె : దార్శనిక నేత,అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని టిడిపి నేతలు పేర్కొన్నారు.తంబళ్లపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కట్టాదొరస్వామి నాయుడు ఆధ్వర్యంలో సోమవారం ములకలచెరువులో సీఎం చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనం జరుపుకున్నారు.ఈ వేడుకులకు తంబళ్లపల్లి నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ సాయినాథ్,మదనపల్లి ఆర్టీసీ 1,2 డిపోల గౌరవ అధ్యక్షులు నాగూర్ వలి (షో ఆప్ శీనా),హరినాథ్ రావు,లక్ష్మీనారాయణ,పాలగిరి సిద్ధా తదితరులు హాజరయ్యారు.ఇందులో భాగంగా కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా దొరస్వామి నాయుడు,నాగూర్ వలిలు మాట్లాడుతూ 76 సంవత్సరాల వయసులోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి,ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు.ఆయన విజన్ దేశానికి ఆదర్శమని కొనియాడారు.ఓవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తూ ఓ యువకుడిలా ఆయన కనబరుస్తున్న పనితీరు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు.ఆయన సారధ్యంలో ఏపీ అన్నిరంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోందన్నారు.ముఖ్యంగా ఆంధ్రుల జీవనాడి పోలవరం,ప్రజా రాజధాని అమరావతి శరవేగంగా జరుగుతున్నాయన్నారు.తన తనయుడు మంత్రి నారా లోకేష్ బాబుతో కలిసి నవ్యాంధ్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు.ఆ భగవంతుడి ఆశీస్సులతో ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని,రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మరికొన్ని సంవత్సరాలు కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున టిడిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News