నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 06 : తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి జన్మదిన వేడుకలు శనివారం తంబళ్లపల్లె మండల కేంద్రంలో కార్యకర్తలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎంపీపీ శ్యామలా కోటిరెడ్డి, ఎంపీటీసీ మహేష్ ఆధ్వర్యంలో వైయస్సార్ సర్కిల్లో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి భారీకేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాణసంచా పేల్చారు.ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నిస్వార్థ ప్రజాసేవ చేయడంలో పెద్దిరెడ్డి కుటుంబానికి సాటిలేరని అందులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ప్రజలకు, కార్యకర్తలకు ఎలాంటి సమస్య వచ్చినా నేనున్నానంటూ ఆదుకోవడంలో ఆయన అందరికీ ఆదర్శప్రాయుడని కొనియాడారు. భవిష్యత్తులో ఆయన మల్లయ్య కొండ మహాశివుని ఆశీస్సులతో రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రేపన చౌడేశ్వర, నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ రేణు మాకులపల్లి సాంబశివారెడ్డి ,మాజీ సర్పంచులు మౌలాలి, సుధాకర్ రెడ్డి, కుడుము నారాయణ ,భాస్కర్ రెడ్డి, చెన్నకేశవరెడ్డి, అశోక్ రెడ్డి,ఎంపీటీసీలు కరీముల్లా, కరీం, కోటికొండ చంద్ర, కొప్పల ప్రకాష్ రెడ్డి ,పద్మనాభ రెడ్డి, నరేందర్ రెడ్డి, రామ్మూర్తి, దామోదర్ రెడ్డి, సుబ్బారెడ్డి, కుమారమ్మ, వై వి సుబ్బారెడ్డి, శివ కుమార్ రెడ్డి, సిద్ధమల్లు, రెడ్డప్పరెడ్డి, శంకర్ రెడ్డి, రవీంద్ర, మధుకర్, మహేష్, రాజారెడ్డి, రామలింగారెడ్డి, రెడ్డి నారాయణ, భద్ర, వైకాపా నాయకులు కార్యకర్తలు, పెద్దిరెడ్డి అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Reporter
Namitha News