Tuesday, 09 June 2026 08:15:25 AM
# శివ మాల దారణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి # స్పేషియల్ కంప్యూటింగ్ భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి పునాది – డాక్టర్ మల్లేశం దాసరి # రాష్ట్రం కూటమి పాలనతోనే అభివృద్ధి వైపు పరుగులు - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి # పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం - ఇరిగేషన్ ఎస్.ఈ. వెంకట్రామయ్య # ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ # మదనపల్లి లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగ # తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు

జలధార-జలహారతికి సహకరించే దాతలను అన్వేషించండి - తంబళ్లపల్లె ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ రెడ్డి

Date : 23 May 2026 10:17 PM Views : 65

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 23 : తంబళ్లపల్లె మండలంలో నీటి సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార-జల హారతి కార్యక్రమానికి సహకరించే దాతలను అన్వేషించాలని అధికారులను తంబళ్లపల్లె ప్రత్యేక అధికారి మరియు డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. శనివారం ఆయన ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు శాఖల అధికారుల గైర్హాజర్ తోబాటు వారి పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండాల్సిన అధికార యంత్రాంగం ఇంత నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన వ్యవసాయం, హార్టికల్చర్, సిరికల్చర్, మైనర్ ఇరిగేషన్, ఫారెస్ట్, ఉపాధి హామీ శాఖల పనితీరుపై ఆరా తీశారు. ప్రాణాధారమైన నీటి ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రతి నీటి బొట్టును ఎక్కడికక్కడ నిలువరించి తద్వారా వ్యవసాయ రంగం అభివృద్ధి తోబాటు పర్యావరణం పరిరక్షణ జరుగుతుందన్నారు. పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకం, ప్రకృతి వ్యవసాయంతో పలు రకాల పంటలు,కూరగాయలు, ఆకుకూరలు పంటలు వేయడానికి సహకరించాలన్నారు. జలధార-జలహారతి పనులు వేగవంతం చేసి చెరువులు, కుంటలు నీటి వనరులు సంరక్షించి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఈ సమీక్ష లో ఎంపీడీవో ఎంవీ ప్రసాద్, ఇరిగేషన్ ఏఈ సతీష్, ఏపీవో అంజనప్ప, ఈసీ మహేష్, 2047 విజన్ సూపర్వైజర్ రెడ్డప్పలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :