Thursday, 30 July 2026 07:14:00 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

108 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెలోకి వెళ్తాం

Date : 08 January 2026 06:58 PM Views : 319

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : 108 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెలోకి వెళ్తాం -- ఈనెల 12 తర్వాత ఎప్పుడైనా 108 ఉద్యోగుల సమ్మె -- సీఐటీయు ఆధ్వర్యంలో నిరసన 108 ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ నెల 12వ తేదీ తర్వాత ఏ క్షణమైన సమ్మె కు వెళ్తామని 108 కాంట్రాక్ట్ ఉద్యోగుల యూనియన్ (సీఐటీయూ) జిల్లా గౌరవాధ్యక్షులు ఎ. రామాంజులు, జిల్లా అధ్యక్షులు రమణ యాదవ్, ప్రధాన కార్యదర్శి బీవీ చలపతి లు పేర్కొన్నారు. గురువారం 108 కాంట్రాక్టు ఉద్యోగుల యూనియన్ (సీఐటీయూ) పిలుపు మేరకు స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపిన అనంతరం డి.ఆర్. ఓ మధుసూదన్ కు సమ్మె నోటీస్ ఇచ్చారు. ఈ సందర్బంగా వారు విలేకరుల తో మాట్లాడుతూ ప్రభుత్వం వేతనం రూ. 4,000 లు పెంచుతూ జి. ఓ నంబర్ 49 ఇచ్చినప్పటికి పూర్తి స్థాయి వేతనం అమలు చేయకుండా కేవలం రూ 2 వేలే ఇవ్వడం సరికాదన్నారు. ఉద్యోగుల వేతనం నుండి పిఎఫ్ కట్ చేసుకుని యాజమాన్యం వాటా పిఎఫ్ బ్యాంక్ ఖాతా కు జమచేయకపోవడం ఉద్యోగులను మోసం చేసే దుర్మార్గపు చర్య గా పేర్కొన్నారు. ఒక్కొక్క నెలలో కొందరికి కారణం తెలపకుండా వేతనం తగ్గించి ఇస్తున్నారని, కనీసం పేస్లిప్ కూడా ఇవ్వకుండా వ్యవహారిస్తున్నా, భవ్య యాజమాన్యంపై అధికారుల చర్యలు శూన్యమని, చిన్న.. చిన్న కారణాలు చూపి ఉద్యోగులను విధుల నుండి తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు 18 ఏళ్ల నుండి సర్వీసు ఉన్న వారికి మళ్ళీ పరీక్ష నెగ్గడం ద్వారా నియామకం పొడిగిస్తామనడం ఉద్యోగ భద్రత గాల్లో దీపంలా ఉందన్నారు. వెంటనే పరీక్షలు రద్దు చేసి, 5 ఏళ్ల సర్వీస్ ఉన్న వారికి స్లాబ్ అప్గ్రేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిలీవింగ్ బిల్లులు, ఐటీ డి ఏ అలవెన్స్ లు క్రమం తప్పకుండ ఇవ్వాలన్నారు. క్యాజువల్ లీవులు, పండుగ సెలవులు అమలు చేయాలని పేర్కొన్నారు. పని చేసే ప్రదేశం లో షెల్టర్ వాహన క్లీనింగ్ వంటి సౌకర్యాలు కల్పించాలని, 8 గంటలు పని అమలు చేయాలని కోరారు. వాహన మరమ్మతులు సిబ్బంది కాకుండా ప్రభుత్వం చేయించి సిబ్బంది కి అప్పుల ఉపశమనం కలిగించాలని కోరారు. జిల్లా కు ఒకటి కాకుండా డివిజన్ కి ఒక గ్యారేజ్ ఏర్పాటు చేయాలన్నారు.ఈ కార్యక్రమం లో జిల్లా నలుమూలల నుండి 108 సిబ్బంది పాల్గొన్నారు. ఫోటో రైటప్ సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆద్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన తెలుపుతున్న 108 ఉద్యోగులు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :