నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 21 ః తంబళ్లపల్లి మండలం కోసువారిపల్లె లో దశాబ్దాలుగా స్మశాన వాటిక లేక స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య పరిష్కారానికి శుక్రవారం రాష్ట్ర రాజధాని అమరావతిలో కోసువారిపల్లె టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ బేరి శ్రీనివాసులు, ముద్దలదొడ్డి వెంకట్ రెడ్డి, వినోద్ కుమార్ తదితరులు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనిగాని ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. గత వైకాపా ప్రభుత్వం జగనన్న కాలనీ పేరుతో లక్షలు దుర్వినియోగం చేసి ఇండ్ల నిర్మాణాలకు పనికిరాని (చౌడు,ఊటు భూమి) స్థలాన్ని కొని లబ్ధిదారులు నిర్మాణాలకు ఒప్పుకోకపోవడంతో నిరుపయోగంగా వదిలేశారు. ఆ స్థలాన్ని స్మశాన వాటికకు కేటాయిస్తే స్థానిక ప్రజలకు దశాబ్దాలుగా స్మశాన వాటిక లేక ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్య తీరుతుందని నివేదించారు. మంత్రి వెంటనే స్పందించి కోసువారిపల్లె లో స్మశాన వాటిక ఏర్పాటు, స్థానిక సమస్యల పరిష్కారంతో పాటు తంబళ్లపల్లె మండలంలోని సమస్యల పరిష్కారానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. తంబళ్లపల్లెలో టిడిపి నాయకులు, కార్యకర్తలు గ్రూపులు వీడి ఐకమత్యంతో కూటమి పార్టీల సహకారంతో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి అవగాహన కల్పించి త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పనిచేసి కూటమి విజయ కేతనం ఎగురువేయాలని సూచించారు.
Reporter
Namitha News