Friday, 31 July 2026 01:54:51 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

స్మశాన వాటిక ఏర్పాటుకు స్థలం కేటాయించండి

కోసువారిపల్లె టిడిపి నాయకులు మంత్రి అనగాని కి వినతి

Date : 22 February 2026 08:22 AM Views : 226

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 21 ః తంబళ్లపల్లి మండలం కోసువారిపల్లె లో దశాబ్దాలుగా స్మశాన వాటిక లేక స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య పరిష్కారానికి శుక్రవారం రాష్ట్ర రాజధాని అమరావతిలో కోసువారిపల్లె టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ బేరి శ్రీనివాసులు, ముద్దలదొడ్డి వెంకట్ రెడ్డి, వినోద్ కుమార్ తదితరులు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనిగాని ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. గత వైకాపా ప్రభుత్వం జగనన్న కాలనీ పేరుతో లక్షలు దుర్వినియోగం చేసి ఇండ్ల నిర్మాణాలకు పనికిరాని (చౌడు,ఊటు భూమి) స్థలాన్ని కొని లబ్ధిదారులు నిర్మాణాలకు ఒప్పుకోకపోవడంతో నిరుపయోగంగా వదిలేశారు. ఆ స్థలాన్ని స్మశాన వాటికకు కేటాయిస్తే స్థానిక ప్రజలకు దశాబ్దాలుగా స్మశాన వాటిక లేక ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్య తీరుతుందని నివేదించారు. మంత్రి వెంటనే స్పందించి కోసువారిపల్లె లో స్మశాన వాటిక ఏర్పాటు, స్థానిక సమస్యల పరిష్కారంతో పాటు తంబళ్లపల్లె మండలంలోని సమస్యల పరిష్కారానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. తంబళ్లపల్లెలో టిడిపి నాయకులు, కార్యకర్తలు గ్రూపులు వీడి ఐకమత్యంతో కూటమి పార్టీల సహకారంతో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి అవగాహన కల్పించి త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పనిచేసి కూటమి విజయ కేతనం ఎగురువేయాలని సూచించారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :