నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రెండు పోలియో చుక్కలతో చిన్నారులకు నిండైన ఆరోగ్యం - తెలుగుదేశం నేత నాగూర్ వలి స్పష్టం మదనపల్లె : రెండు పోలియో చుక్కలతో చిన్నారులకు నిండైన ఆరోగ్యం లభిస్తుందని తెలుగుదేశం నేత,ఆర్టీసీ 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు నాగూర్ వలి (షో ఆప్ శీనా) పేర్కొన్నారు.జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం 14వ వార్డు పరిధిలో ఆయన చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేశారు.ఈ సందర్భంగా నాగూర్ వలి మాట్లాడుతూ పోలియో వ్యాధిని సమూలంగా నిర్మూలించడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి ఏడాది రెండు పర్యాయాలు నిర్వహిస్తారన్నారు.అప్పుడే పుట్టిన చిన్నారి నుండి ఐదేళ్లలోపు పిల్లలకు రెండు పల్స్ పోలియో చుక్కలు తప్పక వేయించాలని తద్వారా వారికి భవిష్యత్తులో ఎటువంటి ప్రాణాంతక జబ్బులు దరిచేరవన్నారు.పట్టణంలోని ప్రతి వార్డుతోపాటు ఆర్టీసీ బస్టాండ్,రద్దీగా ఉండే ప్రాంతాలలో ప్రత్యేక పోలియో కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.కూటమి ప్రభుత్వం చిన్నారుల,ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు.అదేవిధంగా పోలియో రహిత సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వైద్య,అంగన్వాడి,సచివాలయ సిబ్బందికి,తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Reporter
Namitha News