నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 11 ః తంబళ్లపల్లి మండలంలోని మహిళా సంఘాలకు రుణాల పంపిణీలో సంఘ మిత్రలు, వివో సభ్యులు కీలక పాత్ర పోషించాలని ఏపిఎం గంగాధర్ సూచించారు. సోమవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామాలలోని మహిళా సంఘాల కు రుణ సౌకర్యం కల్పించి వారికి విభిన్న వ్యాపారాలు, మినీ పరిశ్రమలు, కోళ్ల పెంపకం, ప్రకృతి వ్యవసాయం తో జీవనోపాదుల వార్షిక ప్రణాళిక బద్దంగా ఆర్థికంగా ఎదగడానికి సహకరించాలన్నారు. మహిళా సంఘాలకు బ్యాంకులు, శ్రీనిధి, వివోలు, పొదుపు ల నుండి రుణాలు పొంది సకాలంలో చెల్లించడానికి వారికి ఆర్థికపరమైన సూచనలు సలహాలు చేయాలని సూచించారు. ఈ సమీక్షలో ఐకెపి మండల అధ్యక్షురాలు రామలక్ష్మమ్మ, సీసీలు రమణ, కత్తి నరసింహులు, ఆదిలక్ష్మి, కృష్ణారెడ్డి, మండలంలోని సంఘమిత్రలు, వివో లీడర్లు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు
Reporter
Namitha News