Wednesday, 17 June 2026 03:08:24 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

అంగన్వాడి సమస్యల పరిష్కారానికి ఎంతవరకైనా సిద్ధం - ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి హామీ

Date : 23 April 2026 11:20 PM Views : 388

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె ఏప్రిల్ 23 : చాలీచాలని జీతాలతో జీవిస్తున్న అంగన్వాడి మహిళామతల్లుల సమస్యల పరిష్కారానికి అండగా నిలబడతానని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి అంగన్వాడీ మహిళలకు హామీ ఇచ్చారు. గురువారం సాయంత్రం అంగన్వాడి కార్యకర్తలు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి స్వగృహం చేరుకుని తమ సమస్యల వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు తమకు కనీస వేతనం రూ 26 వేలు చెల్లించాలని, మే నెల వేసవి సెలవులు ప్రకటించాలని, హెల్పర్ల ప్రమోషన్ జీవో నెంబర్ 5 సవరించాలని, పెండింగ్ లోని మినీ సెంటర్ మెయిన్ సెంటర్ గా మార్పు చేయాలని డిమాండ్లను ఎమ్మెల్యేకు తెలిపారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ మాతా శిశు సంక్షేమంతో పాటు చిన్నారుల పాలిట తల్లులుగా ఆలనా పాలనా చూస్తున్న అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడం సోచనీమన్నారు. అంగన్వాడీలకు పనిభారం పెంచి రకరకాల యాప్ ల ద్వారా వెట్టి చాకిరి చేయించుకుని వారి పనికి తగ్గ వేతనాలు ఇవ్వకపోవడం విచారకరమన్నారు. పాఠశాలలతో పాటు అంగన్వాడీలకు సైతం వేసవి సెలవులు ఇవ్వాలని, 20 26 మార్చి బడ్జెట్ లో అంగన్వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నేటి నిత్యవసర సరుకుల ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకు జీతాలు పెంచి వారి పని భారం తగ్గించి వారి సమస్యలు పరిష్కరించాలని లేదంటే కూటమి ప్రభుత్వానికి అంగన్వాడి మహిళల శాపం తగిలి తీరుతుందని హెచ్చరించారు. మీ సమస్యల పరిష్కారానికి ఓ సోదరుడుగా అండగా నిలబడి పోరాటంలో పాల్గొంటానని హామీ ఇచ్చారు. అంగన్వాడీలు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్యామల కోటిరెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డి, పరుసతోపు సర్పంచ్ శ్రీనివాసులు, నరేందర్ రెడ్డి, శంకర్ రెడ్డి, ఎంపీటీసీలు మహేష్, కరిముల్లా నాయకులు, వందలాది అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: