నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 12 : తంబళ్లపల్లె కు సమీపంలోని మల్లయ్య కొండలో మహాశివరాత్రికి భక్తుల పుణ్య స్నానానికి స్వామివారి పుష్కరిణి సర్వాంగ సుందరంగా దేవాదాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు. కొండకు వచ్చే వేలాది మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి ఈ స్నాన పుష్కరణి లో స్నానమాచరిస్తారు. మహిళలు సంతాన ప్రాప్తి కోసం ఈ పుష్కరిణిలో మునిగి తడి వస్త్రాలతో స్వామివారి ముంగిట సాష్టాంగ నమస్కారం చేస్తే సంతానం కలుగుతుందని స్థానిక భక్తుల గట్టి నమ్మకం
Reporter
Namitha News