నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంకు చెందిన పీట్ల అంజలి బీజేపీ రాజంపేట పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరారు. శుక్రవారం రాజంపేట బీజేపీ పార్టీ కార్యాలయంలో అంజలి కి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ....నన్ను వెన్నుండి ప్రోత్సహించి పార్టీలో చేరికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తంబళ్లపల్లి నియోజకవర్గం లో బీజేపీ పార్టీ బలోపేతం నా వంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఓసూరి కిరణ్, జిల్లా ఉపాధ్యక్షులు సునీత వర్మ, జిల్లా కార్యదర్శి శోభరాణి, నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Reporter
Namitha News