Friday, 31 July 2026 01:31:04 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

డిసెంబర్ 3 కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక శత వార్షికోత్సవం ఉత్సవాలు

హాజరవుతున్న మంత్రులు,అతిరథ మహారథులు

Date : 29 November 2025 06:53 PM Views : 239

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : డిసెంబర్ 3 కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ శతజయంతి ఉత్సవాలు - హాజరవుతున్న మంత్రులు,అతిరథ మహారథులు - షేర్ హోల్డర్లు,డిపాజిటర్లు,ఖాతాదారులు,ప్రజలు హాజరై జయప్రదం చేయాలి - టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్,డైరెక్టర్లు పిలుపు డిసెంబర్ 3న మదనపల్లె కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతోందని మదనపల్లి కో - ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ పిలుపునిచ్చారు.శనివారం స్థానిక ఎన్.వి.ఆర్ కళ్యాణ మండపంలో బ్యాంకు డైరెక్టర్లతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా బ్యాంకు చైర్మన్ నాదెళ్ల విద్యా సాగర్ మాట్లాడుతూ వంద సంవత్సరాల వేడుకలకు బ్యాంకు షేర్ హోల్డర్లు,డిపాజిట్ దారులు,ఖాతాదారులు,ప్రజలు,ప్రముఖులు,విద్యావంతులు వ్యాపారులు,రాజకీయ నాయకులు,ప్రజాప్రతినిధులు హాజరై జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు.డిసెంబర్ 3వ తేదీ (బుధవారం) మదనపల్లె పట్టణం బుగ్గ కాలువలో గల ఎన్.వి ఆర్ కళ్యాణ మండపం నందు ఉదయం పదిన్నర గంటలకు జరగనున్న శతజయంతి ఉత్సవాలకు మంత్రులు,శాసనసభ్యులు,అతిరథ మహారధులను ఆహ్వా నించడం జరిగిందని,వారందరూ హాజరవుతారన్నారు.పుర ప్రజలు,షేర్ హోల్డర్స్,ఖాతా దారులు,డిపాజిట్ దారులు విశ్వాసం,సహకారంతో వందేళ్లు పురోభివృద్ధిలో ముందుకు సాగిందని తెలిపారు.రానున్న రోజుల్లో టౌన్ బ్యాంకుకు మరిన్ని బ్రాంచిలను ఏర్పాటు చేసి,ఖాతాదారులకు మొరుగైన సేవలు అందించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.వందేళ్ల ప్రయాణంలో టౌన్ బ్యాంకు సామాన్య,పేద,మధ్య తరగతి ప్రజలకు ఆర్థికంగా ఆదుకున్న చరిత్రని సొంతం చేసుకుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం కో- ఆపరేటివ్ వ్యవస్థకు వ్యతిరేకం కాదని,స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా కుడా బ్యాంకు అభివృద్ధికి సహకారం అందిస్తున్నారని గుర్తు చేశారు.బ్యాంకు వైస్ చైర్మన్ మరియు పలువురు డైరెక్టర్లు మాట్లాడుతూ బ్యాంక్ శత జయంతి ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు.ఈ వేడుకలకు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.వందేళ్ల ప్రయాణంలో టౌన్ బ్యాంక్ దినదినాభివృద్ధి చెందుతూ ఎంతోమందికి బాసటగా నిలిచి,వారి అభివృద్ధికి తోడ్పడిందని గుర్తు చేశారు.కావున ఈ ఉత్సవాలకు ప్రజలు పుర ప్రముఖులు హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :