నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 19 : పాల సేకరణలో మొదటి స్థానంలో దూసుకుపోతున్న శ్రీజ పాలడైరీ శిగలో మరో అధునాతన పాలసేకరణ కేంద్ర మోడల్ కంటైనర్ ప్రారంభించడం హర్షనీయమని శ్రీజ డైరీ ఏరియా మేనేజర్ కృష్ణప్ప కొనియాడారు. శుక్రవారం తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట ఏరియా సిటిఎం సిసి పరిధిలోని బోయపల్లి తో పాటు బి.కొత్తకోట మండలం కుమ్మరపల్లి లలో జైకా మరియు ఎన్.డి.డి.బి సహకారంతో ఏర్పాటు చేసిన మోడల్ కంటైనర్లను క్లస్టర్ మేనేజర్ శేఖర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఏరియా మేనేజర్ మాట్లాడుతూ శ్రీజ సంస్థ ద్వారా పాల ఉత్పత్తి దారులకు అందుతున్న వివిధ సేవలు, సంక్షేమ కార్యక్రమాలు మరియు సభ్యత్వ ప్రయోజనాల గురించి వివరించారు. క్లస్టర్ మేనేజర్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీజ డైరీకి రోజు కు తొమ్మిది లక్షల లీటర్ల పాలు వస్తున్నాయని అందులో తంబళ్లపల్లి నియోజకవర్గం లో 80 వేల లీటర్లు వస్తున్నట్లు చెప్పారు. జులై నెలలో పాడి రైతులకు అందించాల్సిన బోనస్ అలాగే సబ్సిడీ పథకాలు, బయోగ్యాస్ యూనిట్లు, పశువుల కోసం రబ్బరు మ్యాట్లు వినియోగంపై విశదీకరించారు. అతి త్వరలో మొబైల్ వెటర్నరీ క్లినిక్ సేవలను కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాలమిత్ర సురేష్ పాడి రైతులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పి ఐ సి. కేశవ, శ్రీజ సూపర్వైజర్లు సురేష్, చిట్టిబాబు, బోయపల్లి శ్రీజ వాళ్ళ డైరీ సభ్యులు పాల్గొన్నారు
Reporter
Namitha News