Thursday, 30 July 2026 08:50:36 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మదనపల్లి లోని కేంద్రీయ విద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

కేంద్రీయ విద్యాలయ నూతన ప్రిన్సిపాల్ బాధ్యతలు చేపట్టిన టి . వెంకటేశ్వర్లు

Date : 21 March 2026 07:10 AM Views : 391

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 20 : మదనపల్లి లోని కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని విద్యాలయ ప్రిన్సిపాల్ టి . వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా 20-03-2026న జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో ప్రిన్సిపాల్ జాయినింగ్ రిపోర్టును సమర్పించారు. తరగతుల ప్రారంభం కోసం అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల (బాలురు), మదనపల్లి ఆవరణలోని తాత్కాలిక భవనంలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. 1వ తరగతి అడ్మిషన్లకు దరఖాస్తులు మార్చి 20వ తేదీ నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయని పేర్కొన్నారు. 2వ తరగతి నుండి 5వ తరగతి వరకు దరఖాస్తులు విద్యాలయ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అడ్మిషన్లు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు మాత్రమే కాకుండా ఇతరులకు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. మొదటి తరగతికి దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వయస్సు 31-03-2026 నాటికి కనీసం 6 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలని పేర్కొన్నారు. అన్ని అడ్మిషన్లు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ మార్గదర్శకాల ప్రకారం నిర్వహించబడతాయని తెలిపారు. అడ్మిషన్ గైడ్లైన్స్ మరియు ఇతర వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ www.kvsangathan.nic.in⁠ను సందర్శించవచ్చు. మొదటి తరగతి దరఖాస్తుల కోసం https://admission.kvs.gov.in/⁠ వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు ప్రిన్సిపాల్ గారి మొబైల్ నెంబర్ 9441473837 ను సంప్రదించవలసిందిగా కోరారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :