Thursday, 16 April 2026 04:22:20 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

మదనపల్లి లోని కేంద్రీయ విద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

కేంద్రీయ విద్యాలయ నూతన ప్రిన్సిపాల్ బాధ్యతలు చేపట్టిన టి . వెంకటేశ్వర్లు

Date : 21 March 2026 07:10 AM Views : 234

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 20 : మదనపల్లి లోని కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని విద్యాలయ ప్రిన్సిపాల్ టి . వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా 20-03-2026న జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో ప్రిన్సిపాల్ జాయినింగ్ రిపోర్టును సమర్పించారు. తరగతుల ప్రారంభం కోసం అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల (బాలురు), మదనపల్లి ఆవరణలోని తాత్కాలిక భవనంలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. 1వ తరగతి అడ్మిషన్లకు దరఖాస్తులు మార్చి 20వ తేదీ నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయని పేర్కొన్నారు. 2వ తరగతి నుండి 5వ తరగతి వరకు దరఖాస్తులు విద్యాలయ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అడ్మిషన్లు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు మాత్రమే కాకుండా ఇతరులకు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. మొదటి తరగతికి దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వయస్సు 31-03-2026 నాటికి కనీసం 6 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలని పేర్కొన్నారు. అన్ని అడ్మిషన్లు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ మార్గదర్శకాల ప్రకారం నిర్వహించబడతాయని తెలిపారు. అడ్మిషన్ గైడ్లైన్స్ మరియు ఇతర వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ www.kvsangathan.nic.in⁠ను సందర్శించవచ్చు. మొదటి తరగతి దరఖాస్తుల కోసం https://admission.kvs.gov.in/⁠ వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు ప్రిన్సిపాల్ గారి మొబైల్ నెంబర్ 9441473837 ను సంప్రదించవలసిందిగా కోరారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :