నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 20 : మదనపల్లి లోని కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని విద్యాలయ ప్రిన్సిపాల్ టి . వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా 20-03-2026న జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో ప్రిన్సిపాల్ జాయినింగ్ రిపోర్టును సమర్పించారు. తరగతుల ప్రారంభం కోసం అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల (బాలురు), మదనపల్లి ఆవరణలోని తాత్కాలిక భవనంలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. 1వ తరగతి అడ్మిషన్లకు దరఖాస్తులు మార్చి 20వ తేదీ నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయని పేర్కొన్నారు. 2వ తరగతి నుండి 5వ తరగతి వరకు దరఖాస్తులు విద్యాలయ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అడ్మిషన్లు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు మాత్రమే కాకుండా ఇతరులకు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. మొదటి తరగతికి దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వయస్సు 31-03-2026 నాటికి కనీసం 6 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలని పేర్కొన్నారు. అన్ని అడ్మిషన్లు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ మార్గదర్శకాల ప్రకారం నిర్వహించబడతాయని తెలిపారు. అడ్మిషన్ గైడ్లైన్స్ మరియు ఇతర వివరాల కోసం అధికారిక వెబ్సైట్ www.kvsangathan.nic.inను సందర్శించవచ్చు. మొదటి తరగతి దరఖాస్తుల కోసం https://admission.kvs.gov.in/ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు ప్రిన్సిపాల్ గారి మొబైల్ నెంబర్ 9441473837 ను సంప్రదించవలసిందిగా కోరారు
Admin
Namitha News