నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - నవంబర్ 07 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్శిటీ నందు డిసెంబర్ 5 మరియు 6 తేదీల్లో దేశవ్యాప్తంగా పాలిటెక్నిక్ లెక్చరర్ల కోసం అవుట్కం బేస్డ్ ఎడ్యుకేషన్ (Outcome Based Education (OBE)) పై రెండు రోజుల వర్కుషాప్ ను నిర్వహిస్తున్న పోస్టర్ ను ఏ.నిర్మల్ కుమార్ ప్రియా, తిరుపతి రీజినల్ జాయింట్ డైరెక్టర్, స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్, మరియు అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కె ప్రకాష్ కుమార్ వారి చేతుల మీదుగా తిరుపతి లోని ఆయన కార్యాలయం లో ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమం లో నిర్మల్ కుమార్ ప్రియా మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి పాలిటెక్నిక్ కళాశాలలకు అందులోని కోర్సులకు నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు. ఈ అక్రిడిటేషన్ లో అవుట్కం బేస్డ్ ఎడ్యుకేషన్ ముఖ్యమని ప్రతి అధ్యాపకునికి దీనిపై అవగహన చాలా ముఖ్యమని ఆయన అన్నారు. దీని ద్వారా బోధన నాణ్యతను పెంపొందించడం, విద్యార్థుల ఫలితాలను మెరుగుపరచడం, మరియు పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను విద్యార్థులకు అందించుటకు వీలు కలుగుతుందని అన్నారు. రెండు రోజుల పాటు మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ లో జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రతి పాలిటెక్నిక్ లెక్చరేర్ సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో మిట్స్ ప్రతినిధులు జి.శ్రీనివాసులు మరియు కె. ఎం.డి రియాజ్ అలీ పాల్గొన్నారు.
Admin
Namitha News