నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 03 : మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వ్యవస్థాపకులు, ఛాన్సలర్ డాక్టర్ నాదెళ్ల విజయభాస్కర్ చౌదరి ధర్మపత్ని, ఆర్.ఆర్.ఆర్. ఎడ్యుకేషనల్ అకాడమీ ట్రెజరర్ శ్రీమతి నాదెళ్ల లక్ష్మీ రాజ్యం అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రగాఢ సంతానాన్ని తెలియచేస్తూ వారి పార్ధివ దేహం కు ఘన నివాళులు అర్పించిన తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు బుధవారం మిట్స్ ఎస్టేట్ లో నాదెళ్ల లక్ష్మీ రాజ్యం పార్థివ దేహానికి శ్రీరామ్ చినబాబు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. విద్యా, సేవా కార్యక్రమాల పట్ల ఎల్లప్పుడూ ప్రత్యేక ఆసక్తి కనబరుస్తూ, మానవతా విలువలను ఆచరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఆమె మరణం విద్యారంగం కు తీరని లోటని అన్నారు. మిట్స్ వైస్ ఛాన్సలర్ నాదెళ్ల విజయ భాస్కర్ చౌదరిని పరామర్శించి ధైర్యం చెప్పారు. శ్రీరామ్ చినబాబు తోపాటు సీడ్ మల్లికార్జున నాయుడు, దొరస్వామి నాయుడు, మహబూబ్ ఖాన్, తులసీ నాయుడు, శివ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News