Thursday, 16 April 2026 07:55:43 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

రామసముద్రం లో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు

Date : 06 December 2025 10:45 PM Views : 89

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 06 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో శనివారం భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలను ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని చెక్ పోస్ట్ కూడలిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలోను,సమతా సైనిక దళ్ నాయకుల ఆధ్వర్యంలో, రామసముద్రం జడ్పీ హైస్కూల్లోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలోని పేద బడుగు బలహీన వర్గాల వారికి సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో సమాన హక్కులకు అందించేందుకు ఎనలేని కృషిచేసి రాజ్యాంగాన్ని రచించారని అన్నారు.నవభారత నిర్మాణానికి దార్శనికుడని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శివశంకర్, గెవన్న, క్రిష్ణప్ప, కొమ్ము నారాయణస్వామి, క్రిష్ణప్ప, శివ, జయరాజ్, బాలాజీ, రామాంజులు, అంబరీష్, మెకానిక్ వెంకటేష్, లక్ష్మీపతి, ఎస్ నారాయణస్వామి, ప్రవీణ్, రెడ్డెప్ప , షమీ, చాంద్ భాష, వాలెప్ప, ఎంఈఓ 2 ఆంజనేయులు, ప్రధానోపాధ్యాయులు చిట్టిబాబు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :