Tuesday, 09 June 2026 09:42:31 AM
# శివ మాల దారణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి # స్పేషియల్ కంప్యూటింగ్ భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి పునాది – డాక్టర్ మల్లేశం దాసరి # రాష్ట్రం కూటమి పాలనతోనే అభివృద్ధి వైపు పరుగులు - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి # పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం - ఇరిగేషన్ ఎస్.ఈ. వెంకట్రామయ్య # ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ # మదనపల్లి లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగ # తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు

విజయభారతి క్రికెట్ లీగ్ - 2025 విజేత రాయల్ చాలెంజర్స్

Date : 28 November 2025 05:23 PM Views : 133

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విజయ భారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల చైర్మెన్ డాక్టర్ ఎన్. సేతు ఆదేశాలతో ప్రిన్సిపల్ నిశ్చిత సేతు ఆద్వర్యంలో స్థానిక జిఆర్టీ గ్రౌండ్ లో రెండు రోజుల పాటూ జరిగిన ఉత్కంఠ భరిత క్రికెట్ లీగ్ లో రాయల్ చాలెంజర్స్ విజేతలుగా నిలిచారు. మొదటి రోజు జరిగిన క్వాలిఫైయింగ్ మ్యాచ్ లలో మొత్తం ఎనిమిది టీములు పాల్గొనగా వాటిలో రాయల్ చాలెంజర్స్, విక్టరీ స్ట్రైకర్స్, రాయల్ ఎంపరర్స్, క్లాసిక్ నైట్స్ నాలుగు టీములు సెమీ ఫైనల్ కు చేరుకున్నాయి. వీటిలో రాయల్ చాలెంజర్స్, విక్టరీ స్ట్రైకర్స్ తో తలపడి విజయం సాధించగా, రాయల్ ఎంపరర్స్ పై క్లాసిక్ నైట్స్ టీం విజయం సాధించి ఫైనల్ కు చేరుకున్నాయి. ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచి క్లాసిక్ నైట్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ కు దిగిన రాయల్ చాలెంజర్స్ నిర్ణీత 10 ఓవర్లలో సంతోష్ వీరోచిత బ్యాటింగ్ తో పరుగుల వరద పారించాడంతో ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 112 పరుగులు సాధించింది. సంతోష్ కేవలం 26 బంతుల్లో 49 పరుగులు సాధించి జట్టు విజయానికి గట్టి పునాది వేసాడు. 49 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బారీ షాట్ కు యత్నించి ఔట్ అయ్యి వెనుదిరిగాడు. దీంతో రాయల్ చాలెంజర్స్ టీం 112 పరుగులు సాధించింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన క్లాసిక్ నైట్స్ టీం పది ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్ల నష్టానికి కేవలం 82 పరుగులు మాత్రమే సాధించింది. దీంతో రాయల్ చాలెంజర్స్ సునాయసంగా విజయం సాధించింది. క్లాసిక్ నైట్స్ టీం లో చరిత్ 29, క్యాప్టెన్ మణికంఠ 18 పరుగులు మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్థాయిలో పరుగులు సాధించలేకపోయారు. విజయం సాధించిన రాయల్‌ చాలెంజర్స్, రన్నర్స్ గా నిలచిన క్లాసిక్ నైట్స్ జట్లకు మదనపల్లి శాసనసభ్యుడు షాజహాన్ బాషా, విజయ భారతి పాఠశాల చైర్మెన్ డాక్టర్ ఎన్. సేతు, ప్రిన్సిపాల్ నిశ్చిత, బిటి కళాశాల ప్రిన్సిపాల్ మలిగి రాఘవరెడ్డి లతో కలసి ట్రోఫీని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గెలుపోటములు సహజమని క్రీడా స్పూర్తిని పెంపొందిస్తూ ఇంత చక్కగా రాణించిన క్రీడాకారులందరికీ అభినందనలు తెలియజేశారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :