Friday, 31 July 2026 10:40:43 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మల్లయ్య కొండ తవ్వకాలపై వైసీపీ దుష్ప్రచారం_ భక్తుల ప్రజల మనోభావాలు మాకు ముఖ్యం.

భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకున్న టిడిపి ఎమ్మెల్యే లు

Date : 30 June 2026 12:09 AM Views : 154

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబల్లపల్లి జూన్ 29 : మల్లయ్య కొండ, సాదుకొండ, ఇనుముకొండలలో ఇనుప ఖనిజాల కోసం తవ్వకాలు జరుపుతున్నారని, ప్రభుత్వం ఏదో చేసేస్తోందని తంబళ్లపల్లి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, వైసీపీ నాయకులు ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సోమవారం తంబళ్లపల్లి మల్లయ్య కొండపై వెలసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో పాటు రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు సుగువాసి ప్రసాద్ బాబు, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష పలువురు ప్రజా ప్రతినిధులు దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మల్లయ్య కొండ అంటే మా ప్రాంత ప్రజలకు పవిత్రమైన దైవ క్షేత్రం. ఇక్కడ మైనింగ్ తవ్వకాలు జరుగుతున్నాయని వైసీపీ నేతలు కావాలని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. ప్రజల మనోభావాలతో చెలగాటం ఆడటమే వారి పని. అలాంటిది ఏదీ జరగడం లేదు, జరగనివ్వమని స్పష్టం చేశారు.8 గతంలో 2011లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తవ్వకాల కోసం ప్రచారం జరగడంతో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడుకు విమర్శించే అర్హత మీకు లేదని ఆయన హెచ్చరించారు. జనవరి నెల 22వ తేదీ 2024 సంవత్సరంలో ఎర్ర కొండకు టెండర్లు పిలిచింది వైసీపీ ప్రభుత్వమేనని మళ్లీ ప్రభుత్వం పైన బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. భక్తులు,ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం, అదే మా కర్తవ్యం. మల్లయ్య కొండ,మల్లికార్జున గుడి మా ప్రజల విశ్వాసం. ఆ విశ్వాసాన్ని కాపాడటం మా బాధ్యత. ప్రజలు ఎలాంటి అపోహలకు, వైసీపీ రెచ్చగొట్టే మాటలకు లోనుకావొద్దు. ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో కొండలను, గుట్టలను కొల్లగొట్టిన వారే ఇప్పుడు దొంగే దొంగ అన్నట్టు మాట్లాడటం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆస్తులను, దేవుళ్ల మాన్యాలను కంటికి రెప్పలా కాపాడుతుందని తేల్చిచెప్పారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా,రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు,రాష్ట్ర బిసి మహిళా అధ్యక్షురాలు పర్వీన్ తాజ్,రాష్ట్ర బిసి సెల్ అధ్యక్షుడు త్యాగరాజు,ఆర్ జే వెంకటేష్,కట్టదోరస్వామి నాయుడు,కొండ్రేడ్డి అరుమండలాల టీడీపీ మండల అధ్యకులు,టిడిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: