నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - మార్చి 15 : పుంగనూరు పట్టణం త్యాగరాజ వీధి లో విషాదకరమైన ఘటన ద్విచక్రవాహనం నుండి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఊపిరాడక ఒకే ఇంటిలో నలుగురు మృతి పుంగనూరు పట్టణం త్యాగరాజు వీధి లో నివసిస్తున్న మురళి ఓ మెకానిక్ వద్ద తన ద్విచక్ర వాహనం కు బోర్ చేయించగా ఓ 5 గంటల పాటు ఇంజన్ రన్నింగ్ లో ఉండాలని తెలిపితే మా ఇంటి వద్ద రన్నింగ్ లో ఉంచుకోంటానని తెలిపి ద్విచక్ర వాహనాన్ని ఇంటికి తెచ్చుకొని నిద్రించే సమయం లో వాహనం స్టార్ట్ చేసి ఉంచగా ఇంట్లో కొడుకు కార్తీక్, ఇద్దరు కవల పిల్లలు చందన, చరిత లతో కలిసి తన తండ్రి రామచంద్ర నిద్రించగా తాను తన భార్య రేవతి మిద్దిపైన నిద్రించాము ఉదయం ఎంతసేపటికీ తలుపు తెర్వకపోవడం స్థానికుల సాయం తో బద్దలు కొట్టి తలుపు తెర్వగా విగతజీవులు గా పడి ఉన్న తండ్రి, బిడ్డలు. విషాదకరమైన ఘటన దావాణం లా వ్యాపించడం తో భారీగా గుమికూడిన స్థానికులు, పుంగనూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న ఇన్స్పెక్టర్ సుబ్బారాయుడు ప్రాథమికంగా రాత్రి నుండీ ద్విచక్ర వాహనం స్టార్టింగ్ లో ఉంచి గడివేయడంతో వాహనం నుండీ పొగ బయటకు వెళ్లకపోవడం, వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పీల్చుకుని ఇంటిలోని నలుగురు మృతి చెందినట్లు గా బావిస్తున్నాం, మృతదేహలను పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రి కి తరలిస్తున్నట్లు, పోస్టు మోర్టుమ్ నివేదిక ఆధారంగా విచారణ చేస్తామని వెల్లడించారు. ఒకే కుటుంబం లో నలుగురు మృతి చెందడం తో పట్టణం లో విషాదకర వాతావరణం
Reporter
Namitha News