Thursday, 30 July 2026 09:21:03 PM
# నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు

మదనపల్లె ను ఐటి కారిడార్ గా తీర్చిదిద్దెలా కృషి చేయాలి

రాయల్ యూత్ సొసైటీ అధ్యక్షులు రేగడి ప్రసాద్ కుమార్ డిమాండ్

Date : 22 February 2026 11:30 AM Views : 249

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : యువత, విద్యార్థులు, మహిళలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ పథకాలను అందించాలి - మదనపల్లె ను ఐటి కారిడార్ గా తీర్చిదిద్దెలా కృషి చేయాలి - రైతుల ప్రయోజనాల కోసం శీతల గిడ్డంగులు, పల్ప్ యూనిట్లు నెలకొల్పాలి - అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడి అభివృద్ధి కి బాటలు వేయాలి - రాయల్ యూత్ సొసైటీ అధ్యక్షులు రేగడి ప్రసాద్ కుమార్ డిమాండ్ - అన్నమయ్య జిల్లాకు మదనపల్లె పేరు చేర్చడం అంటే బలిజలను చులకన చేయడమే మదనపల్లె ఫిబ్రవరి 21, గత నాలుగు ఏళ్ళ గా మదనపల్లె జిల్లా కోసం బలిజ సేవా సమితి ఆధ్వర్యంలో రాజీ లేని పోరాటం చేయడం జరిగిందని, అది జరగక పొగ అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లె కు మార్చడం జరిగిందని రాయల్ యూత్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు రేగడి ప్రసాద్ కుమార్ అన్నారు. శనివారం రాయల్ యూత్ సొసైటీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా పేరును శ్రీకృష్ణదేవ రాయల జిల్లాగా పెట్టాలని కోరుతూ బిసి రాష్ట్ర మంత్రి జనార్దన్ రెడ్డికి, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ కు టిడిపి రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులకు, కూటమీ పార్టీల నాయకులకు, మదనపల్లి ఎమ్మెల్యే కి వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. అయితే బలిజల విజ్ఞప్తిని పరిగణలోకి తీసు కోకుండా అన్నమయ్య జిల్లాకు మదనపల్లె అన్నమయ్య జిల్లాగా మార్చడం అంటే బలిజ సామాజిక వర్గాన్ని చులకన చేయడమే అన్నారు. జిల్లా కేంద్రమైన మదనపల్లె నందు మహిళలు, యువత, విద్యార్థులు, నిరు ద్యోగులకు ఉద్యోగ మరియు ఉపాధి కల్పన కోసం ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడి సబ్సిడీ రుణాలు అందించే గట్టి ప్రయత్నం చేయాలని కోరారు. మదనపల్లి డివిజన్ లో అత్యధికంగా రైతులు టమోటా పంట సాగు చేసుకుంటున్నారని, అయితే సరైన గిట్టుబాటు ధరల రేఖ మద్దతు ధరలు అందక రైతులు అప్పులు ఊబిలో చిక్కుకుపోతున్నారని, అంతే కాకుండా మామిడి, పూలు, కూరగాయలు, ఉద్యానవన పంటలు సాగు రైతులు వున్నారని, వారి కోసం ప్రభుత్వం వెంటనే శీతల గిడ్డంగులను నిర్మించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా చేనేత రంగానికి కేంద్రంగా మదనపల్లె వృద్ధి చెందుతున్న నేపథ్యంలో మహిళలు, నేతన్నలకు చిన్న తరహా పరిశ్రమలు, హ్యాండ్లూమ్స్, పవర్ లూమ్స్ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎం ఎస్ ఎం ఈ కింద సబ్సిడీ రుణాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న విప్లవాత్మక మార్పులతో మదనపల్లె ను ఐటి హబ్ గా ఏర్పాటు చేసేందుకు యువతకు విద్యార్థులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను విదేశాలు ఇతర రాష్ట్రాల్లో అందించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై శాసనసభ సమావేశాలు ముగిసే లోపు ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించి వీటిపై ప్రభుత్వం స్పందించే విధంగా ఒప్పించాలని కోరారు. అలాగే ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లాలన్నారు. అదేవిధంగా రైతన్నకు అండగా నిలిచేందుకు పల్ప్ తయారీ యూనిట్లను నెలకొల్పా లన్నారు. యువత, విద్యార్థులు, రైతులు కు ఉపాధి అవకాశాలు సన్నగిళ్లడం తో వ్యసనాలకు బానిసై కుటుంబాలకు దూర మవుతున్నారని గుర్తు చేశారు. స్వల్ప కాలంలో ఆదాయం పెంపొందించే విధంగా నియోజక వర్గంలో చేతివృత్తులు, స్వయం ఉపాధి రంగాల్లో యువతను, నిరు ద్యోగులను ప్రోత్సహించాలని అప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు. నియోజక వర్గం, జిల్లా కేంద్రంలో దీర్ఘకాలిక ప్రయోజనాలను పరిగణలోనికి తీసుకుంటూనే యువతను మహిళలను రైతాంగాన్ని నిరుద్యోగులను ఆదుకునే గట్టి ప్రయత్నాలు చేపట్టాలని కోరారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: