నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బెంగళూరులోని రెయిన్ బో ఆసుపత్రిలో (9) ఏళ్ల బాలుడు అయాన్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న తంబళ్లపల్లి నియోజకవర్గం టీడీపీ సీనియర్ నాయకుడు కట్ట దొరస్వామి నాయుడు బుధవారం బాలుడు అయాన్ తల్లిదండ్రులను పరామర్శించి చికిత్స కొరకు, లక్ష రూ. తనవంతు సాయంగా అందించి మానవత్వం చాటుకున్నారు. అనంతరం అయాన్ చికిత్సకు అన్ని విధాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీ,ఎం,ఆర్,ఫ్ ద్వారా తమకు సహాయం అందిస్తామని నాయకులకు కూడా చేతనైనంత సాయం చేసి ఆదుకోవాలని కోరారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసానిచ్చారు.
Admin
Namitha News