Thursday, 30 July 2026 05:52:27 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మదనపల్లి పట్టణంలో 'ధర్నా చౌక్' ఏర్పాటు చెయ్యాలి - సీపీఎం డిమాండ్

Date : 28 February 2026 08:56 PM Views : 188

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 28 : మదనపల్లి పట్టణంలో 'ధర్నా చౌక్' ఏర్పాటు చెయ్యాలని సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం జిల్లా ఎస్పీ కి వినతిపత్రం అందచేసినట్లు ఆయన వివరించారు. శనివారం స్థానిక సీపీఎం కార్యాలయంలో శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కార్మిక సంఘాలు, సంస్థలు మరియు రాజకీయ పార్టీలు నిరసనలు తెలపడం ఒక రాజ్యాంగ హక్కు అని పేర్కొన్నారు. మదనపల్లి జిల్లా కేంద్రంగా మారిన తర్వాత ట్రాఫిక్ సమస్యలు పెరిగాయని, జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసనలకు పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారని దీనిని సీపీఎం తరఫున ఖండిస్తున్నట్లు తెలిపారు. నిరసనకారులకు ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా మదనపల్లి పట్టణంలో ఒక ప్రత్యేక 'ధర్నా చౌక్'ను ఏర్పాటు చేయాల్సిన భాద్యత పోలీసులది కాదా అని ప్రశ్నించారు. ​పోలీసులు మున్సిపల్, రెవిన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని ధర్నా చౌక్ ఏర్పాటు చెయ్యాలని కోరారు. చిత్తూరు బస్టాండ్ వద్ద ఉన్న ఖాళీ స్థలం ధర్నా చౌక్‌కు అనువుగా ఉంటుందని పార్టీ తరపున ప్రతిపాదిస్తున్నట్లు వివరించారు. అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలతో చర్చించి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :