నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 24 : తంబళ్లపల్లె నియోజకవర్గం లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార కార్యక్రమం ద్వారా నీటి సంరక్షణ పనులతో పాటు 2047 విజన్ విజయవంతం చేయాలని తంబళ్లపల్లె నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో ఆరు మండలాల ఎంపీడీవోలు, 2047 విజన్ సిబ్బందితో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలధార కార్యక్రమంలో సాగునీటి వనరులు మరమ్మతులు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు , కాలువలు భూగర్భ జలాలు పెంపు కు వి బి జి రాంజీ పథకం ద్వారా మనుమతులు చేపట్టి సహకరించాలన్నారు. అదేవిధంగా 2047 విజన్ లో భాగంగా అభివృద్ధి పనులపై ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రాధాన్యత క్రమంలో క్షేత్రస్థాయిలో పర్యటించి అత్యవసర ప్రజాహిత సమస్యలపై దృష్టి సాధించి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాల పనులపై చొరవ చూపాలని ఎంపీడీవోలు మండల స్థాయిలో తమ సచివాలయాల పరిధిలోని అధికారుల ద్వారా సమస్యలు గుర్తించి పరిష్కారానికి కలసి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరు మండలాల ఎంపీడీవోలు, 2047 విజన్ సిబ్బంది, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు
Reporter
Namitha News