Friday, 31 July 2026 10:40:46 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మదనపల్లి అభివృద్ధికి ఎక్కడికైనా చర్చ కు సిద్ధం - ఎమ్మెల్యే షాజహాన్

టౌన్ బ్యాంక్ అవినీతిపై సీబీఐ, సీఐడీ విచారణకైనా సిద్ధం - ఎమ్మెల్యే షాజహాన్ బాషా

Date : 24 June 2026 05:00 PM Views : 154

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 24 : మదనపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో మీడియా సమావేశం లో ఎమ్మెల్యే మాట్లాడుతూ ​కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం.. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం... ​గత ఐదేళ్ల అరాచకాలకు చెక్.. మదనపల్లి రూపురేఖలు మారుస్తాం. ​టౌన్ బ్యాంక్ అవినీతిపై సీబీఐ, సీఐడీ విచారణకైనా సిద్ధం..మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి, సుపరిపాలనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం నడుస్తోందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పష్టం చేశారు. మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో జరిగిన భూకబ్జాలు, అరాచకాలను తీవ్రంగా ఎండగట్టారు. ​ మా ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల్లో ఉండే ప్రభుత్వం.. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. ఒకప్పుడు మదనపల్లి టౌన్ లో వర్షం పడితే రోడ్లు ఈతకొట్టేలా ఉండేవి. కానీ,ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే దాదాపు 59 అభివృద్ధి పనులకు భూమిపూజ చేశాం. మదనపల్లి చుట్టూ రింగ్ రోడ్ బైపాస్ కోసం 470 కోట్ల రూపాయల అంచనాలతో డీపీఆర్ (DPR) సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాం. ​గత పాలకులు కేవలం భూకబ్జాలకు పాల్పడ్డారు. సీటీఎం చెరువులను కూడా వదలకుండా ఆక్రమించారు. పేదల డికెటి భూములను లాక్కున్నారు. కానీ, మా హయాంలో అక్రమాలకు తావులేదు. రోడ్డు వెడల్పులో భాగంగా 22 చెట్లు తొలగిస్తే.. దానికి బదులుగా 1000 చెట్లను నాటాం.రాబోయే రోజుల్లో నియోజకవర్గవ్యాప్తంగా మా కూటమి నాయకులతో కలసి 10,000 చెట్లు నాటడమే మా లక్ష్యం. మదనపల్లి టౌన్ బ్యాంక్ వ్యవహారంలో జరిగిన అవినీతిపై ఎలాంటి విచారణకైనా మేము సిద్ధం. సీఐడీ (CID) లేదా సీబీఐ (CBI).. ఏ విచారణ జరిపించినా పూర్తి బాధ్యతతో సహకరిస్తాం. తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అదేవిధంగా, నిరుద్యోగుల కోసం 16,347 ఉద్యోగాలతో డీఎస్సీ (DSC) నోటిఫికేషన్ ఇచ్చి, ఎలాంటి సిఫార్సులు లేకుండా కేవలం మెరిట్ ప్రాతిపదికన అత్యంత పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. ​ మైనారిటీల సంక్షేమానికి కట్టుబడిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు.తెల్లవారుజామున 7 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు నిత్యం ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. మెడికల్ కాలేజీ నిర్మాణంలో జరిగిన ప్రజాధనం దుర్వినియోగంపై కూడా అసెంబ్లీ సాక్షిగా గళమెత్తాం. మదనపల్లిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే మా ఏకైక లక్ష్యం" అని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ధీమా వ్యక్తం చేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :