Friday, 31 July 2026 11:03:02 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

వైష్ణవి దేవి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు

Date : 12 December 2025 10:58 PM Views : 162

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చౌడేపల్లి - డిసెంబర్ 12 : చౌడేపల్లి మండలంలోని పుదిపట్ల గ్రామంలో గల స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో మార్గశిర మాసం, అష్టమి తిది, శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకురాలు శ్రావణి స్వయంభు శ్రీ వైష్ణవి దేవి, అభయాంజనేయ స్వామి, నాగభైరవ స్వాములకు పంచామృత అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారిని వివిధ రకాల రంగురంగుల పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అష్టమి ప్రత్యేకతగా నాగభైరవ స్వామి సన్నిధిలో భక్తులు పంచదీపారాధనలు సమర్పించారు. కుజదోషం, సర్పదోషం నివారణకు, వివాహం కాని వారు, సంతానం కోరిక ఉన్న వారు, అనారోగ్యంతో ఉన్న భక్తులు అష్టమి రోజున పంచదీపారాధన చేయడం శ్రేయస్కరమని ఆలయ అర్చకురాలు తెలిపారు. చౌడేపల్లి, పుంగనూరు, మదనపల్లి మరియు పరిసర గ్రామాల భక్తులు భారీ సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. హైద‌రాబాద్‌కు చెందిన శ్రీకాంత్, ధర్మపత్ని ఉమామహేశ్వరి ఉభయ దారులుగా సేవలు అందించారు. ఆలయ ధర్మకర్త వినోద్‌కుమార్ భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: