నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : సోమల - నవంబర్ 05 : సోమల మండలం ఎస్ . నడింపల్లె పంచాయతీ ఎర్రంవారి పల్లె సమీపంలో మంగళవారం మధ్యాహ్నం సమయం లో అమానుషమైన మానవీయ సంఘఘటన చోటుచేసుకొంది. యస్. నడింపల్లి కి చెందిన సులోచన అటుగా వెళుతుండగా బిడ్డ ఏడుపులు వినబడటం తో పరిసరాలు గమనించగా ముళ్ల పొదలలో శిశువు ను గుర్తించి స్థానికులకు తెలిపి బిడ్డపేగు పేగు కత్తరించి పోలీసులకు, ఐ.సి.డి.యస్. అధికారులకు తెలిపి 108 వాహనం లో సోమల పి.హెచ్.సి. కి తరలించి వైద్యం అందించారు. ఆసుపత్రి వద్దకు చేరుకొన్న ఆశ వర్కర్, ఐ.సి.డి.యస్. సిబ్బంది ఆడ శిశువు ను స్థానిక ఆశ వర్కర్ ఆధ్వర్యంలో చిత్తూరు శిశు విహార్ కు తరలించిన అధికారులు. పుట్టిన శిశువు ను ముళ్లపోదల్లో వదిలివేయడం పై స్థానికుల్లో భిన్న అభిప్రాయాలు, సభ్య సమాజం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తోందోనని చర్చించుకొంటున్నారు.
Admin
Namitha News