Wednesday, 17 June 2026 02:47:18 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

జాతీయ స్థాయి లో యన్.సి.సి. లో ప్రతిభ కనబర్చిన మిట్స్ విద్యార్థులు

Date : 30 April 2026 08:09 PM Views : 115

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 30 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఎన్‌సీసీ విభాగానికి చెందిన క్యాడెట్లు అడ్వెంచర్ క్యాంపులో విశిష్ట ప్రతిభ కనబరిచారని వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. ఎన్‌సీసీ విభాగం నుండి వై. హర్షిత, ఎస్.కె. సానియా హఫ్సా అనే ఇద్దరు విద్యార్థులు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని మనాలి లో గల అటల్ బిహారి వాజపేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అలైడ్ స్పోర్ట్స్ నిర్వహించిన పది రోజుల అడ్వెంచర్ క్యాంపులో పాల్గొన్నారు. భారతదేశంలోనే అత్యుత్తమ సాహస క్రీడల శిక్షణా కేంద్రంగా పేరుపొందిన ఈ సంస్థలో రాక్ క్లైంబింగ్, రాపెలింగ్, రివర్ క్రాసింగ్ వంటి సాహస కార్యక్రమాలతో పాటు సుమారు 10,200 అడుగుల ఎత్తులో పర్వతారోహణ (మౌంటెన్ ట్రెక్కింగ్) నిర్వహించబడగా, మౌంటెన్ రెస్క్యూ విధానాలపై కూడా శిక్షణ అందించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ, ఇలాంటి కఠిన శిక్షణల ద్వారా క్యాడెట్లలో ప్రకృతి సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం, జట్టు భావన, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని, దేశ సేవకు సిద్ధమయ్యే గుణాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ప్రతి క్యాడెట్ దేశ రక్షణలో తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆయన ఆకాంక్షించారు. 2 నుండి 3 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలో 10 రోజులపాటు కష్టపడి శిక్షణను విజయవంతంగా పూర్తిచేసి సర్టిఫికెట్లు అందుకున్న క్యాడెట్లు వై. హర్షిత, ఎస్.కె. సానియా హఫ్సాలను యూనివర్సిటీ ఫౌండర్ & చాన్సలర్ డాక్టర్ ఎన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో చాన్సలర్ ఎన్. ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామనాథన్ మరియు ఎన్‌సీసీ ఆఫీసర్ కెప్టెన్ ఎన్. నవీన్ కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా ఎన్‌సీసీ కెప్టెన్ ఎన్. నవీన్ కుమార్ మాట్లాడుతూ, ఈ అవకాశాన్ని కల్పించిన 35 ఆంధ్ర బెటాలియన్ చిత్తూరు కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎన్.వి. మౌనిష్ మరియు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ లోగనాధన్ లకు కృతజ్ఞతలు తెలిపారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: