Friday, 31 July 2026 12:46:52 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

స్వర్ణంద్ర గా తీర్చిదిద్దే క్రమంలో అన్నమయ్య జిల్లా ఆదర్శంగా నిలవాలంటున్నా కలెక్టర్ నిశాంత్ కుమార్

క్లీన్ స్వీప్ కార్యక్రమం లో రాష్ట్ర వ్యాప్తంగా మొదటి మూడు మునిసిపాలిటీ లో మదనపల్లి కి దక్కడం పై కలెక్టర్ హర్షం

Date : 18 July 2026 04:20 PM Views : 75

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - జూలై 18 : స్వర్ణంద్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం లో భాగంగా నేడు రాయచోటి పట్టణం లోని శెట్టిపల్లి డంపింగ్ యార్డ్ వద్ద మునిసిపల్ శాఖ ఆధ్వర్యంలో జరగుతున్న కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మెటీరియల్ రికవరీ ఫెసలిటి ని ప్రారంభించిన అనంతరం ఘన వ్యర్థల నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన క్లీన్ స్వీప్ కార్యక్రమం లో మదనపల్లి మునిసిపాలిటీ కి రాష్ట్ర వ్యాప్త అవార్డు రావడం తో హర్షం వ్యక్తం చేస్తూ పరిశుభ్రత అనేది ప్రభుత్వ కార్యక్రమం గా భావించకుండా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత గా భావించి రాష్టాన్ని స్వర్ణ ఆంధ్ర గా తీర్చిదిద్దుకొందామని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

రాయచోటి డంపింగ్ యార్డు వద్ద ప్రారంభించిన మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ ద్వారా ఘన వ్యర్థాల నిర్వహణలో మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. రాయచోటి మున్సిపాలిటీలో రోజుకు సుమారు 60 టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని, వాటిలో ప్లాస్టిక్, రబ్బరు తదితర వ్యర్థాలను శాస్త్రీయంగా వేరు చేసి పునర్వినియోగానికి పంపించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు మున్సిపాలిటీకి అదనపు ఆదాయం సమకూరుతుందని చెప్పారు. రోజుకు 20 టన్నుల వ్యర్థాలను శుద్ధి చేసే సామర్థ్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే రాయచోటిలో ఘన వ్యర్థాల నిర్వహణకు అవసరమైన పూర్తి మౌలిక వసతులను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఫీకల్ స్లడ్జ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (FSTP) నిర్మాణం పూర్తయిందని, విద్యుత్ కనెక్షన్ అందిన వెంటనే కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపారు. అదేవిధంగాచౌడేపల్లి మండలంలో గోవర్ధన్ ప్లాంట్ నిర్మాణం పూర్తయిందని, గుర్రంకొండలో మరో గోవర్ధన్ ప్లాంట్‌ను ఈ నెలాఖరులోగా పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ఈ ప్లాంట్ల ద్వారా పశువుల పేడతో పాటు ఇతర జీవ వ్యర్థాలను శాస్త్రీయంగా ప్రాసెస్ చేసి ఉపయోగకరమైన ఉత్పత్తులుగా మార్చే అవకాశం ఉంటుందని తెలిపారు. పరిశుభ్రతను కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా భావించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ నిరంతరం భాగస్వాములై అన్నమయ్య జిల్లాను పరిశుభ్రత, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణలో ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు

ఈ కార్యక్రమంలో రాయచోటి ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ యామిని, రాయచోటి మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, మున్సిపల్ సిబ్బంది, ప్రభుత్వ అధికారులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: