నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 03 : మంగళవారం తంబళ్లపల్లె జూనియర్ సివిల్ కోర్టుకు రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర చైర్మన్ కొమ్మిరెడ్డి పట్టాభిరామ్ హాజరయ్యారు. 2023లో ఓ టీవీ డిబేట్లో అప్పటి వైకాపా ప్రభుత్వంతో పాటు నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను అప్పట్లో తంబళ్లపల్లె వైకాపా నాయకులు పరువు నష్టం పై కోర్టులోదావా వేశారు. ఆ కేసు నిమిత్తం మంగళవారం ఆయన తంబళ్లపల్లె కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఆరు మండలాల నుండి పెద్ద ఎత్తున టిడిపి, కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరై ఆయనకు సంఘీభావం తెలిపారు. కోర్టు బయట పట్టాభిరామ్ కు ఘనంగా సన్మానించి కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా కోర్టు వద్ద ఎస్సై అనిల్ కుమార్ సారథ్యంలో బందోబస్తు నిర్వహించారు
Reporter
Namitha News