నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : డిసెంబర్ 02: మదనపల్లె నియోజకవర్గం కురవంక పంచాయతీ లో గత మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న పారిశుధ్య కార్మికుల వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మంగళవారం కురువంక వార్డు నెంబర్లతో కలిసి పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్ చేసి ఎంపీడీవో కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వార్డు నెంబర్లు కృష్ణమూర్తి, నాగరాజా మాట్లాడుతూ.... కురువంక గ్రామపంచాయతీలో 12 వార్డుల్లో పారిశుద్ధ్య కార్మికులు పనులు నిర్వహిస్తున్నారు. వీరితోపాటు వీధిలైట్లు, బిల్ కలెక్టర్, వాటర్ మ్యాన్,తో కలిపి ఇద్దరు ఆటో డ్రైవర్లు పనిచేస్తున్నారు. గత మూడు నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంగా గ్రామ సర్పంచ్ అడిగితే సెక్రటరీని అడగమన్నారు. ఇక్కడ పనిచేసిన సెక్రటరీ సస్పెండ్ అవడంతో కురవంక పంచాయతీలో సెక్రటరీ లేక వేతనాలు అందడం లేదని తెలిపారు. వెంటనే పంచాయతీ సెక్రటరీ నియమించాలని ఎంపీడీవోను కోరారు.
Reporter
Namitha News