నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 12 : బాలికలు తమ భద్రత కోసం ఏర్పాటైన చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఎస్సై టి అనిల్ కుమార్ సూచించారు. గురువారం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో తంబళ్లపల్లె హైస్కూల్లో చట్టాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ బాలికలు టీనేజీ వయసులో ఆకర్షణలను నియంత్రించకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలు, వాటికి సంబంధించిన కేస్ స్టడీస్, ఫోక్సో చట్టం పై అవగాహన కల్పించారు. విద్యార్థులు చదువు ద్వారా వ్యక్తిగత స్థాయి ఎలా పెంచుకోవాలి మన ప్రవర్తన ఇతరులకు ఆదర్శంగా ఉండి తమ తల్లిదండ్రులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులకు గురి చేయకుండా మెలగాలన్నారు.బాల,బాలికలు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, సెల్ ఫోన్ల ద్వారా జరుగుతున్న మోసాలు, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు వల్ల పిల్లల జీవితాలకు కలిగే దుష్ప్రభావాల నివారణకు ప్రభుత్వం మహిళలు, పిల్లల భద్రత కోసం శక్తి యాప్ ఉపయోగాలు, అత్యవసర సహాయ నంబర్లు 1930, 112,1098, గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు ఈ అవగాహన కార్యక్రమం ద్వారా చట్టాలపై అవగాహనతో పాటు బాధ్యతాయుతమైన ప్రవర్తన పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శక్తి టీం సభ్యులు బి ముని కుమార్ నాయక్, శశికళ, జి ఎం ఎస్ కె శివకుమారి, ఎస్ఐ నజీర్ భాష, సిబ్బంది రాఘవ, హై స్కూల్ కమిటీ చైర్మన్ శివకుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News