Thursday, 16 April 2026 04:23:51 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం - తహసీల్దార్ రాము

Date : 30 December 2025 05:53 PM Views : 109

నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : పుంగనూరు - డిసెంబర్ 30 : పుంగనూరు మండలం పాలెంపల్లి గ్రామంలో మంగళవారం ముడి పాపనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సి ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని తహసీల్దార్ రాము ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రాము మాట్లాడుతూ, సీజనల్ వ్యాధుల నివారణకు ప్రజల అవగాహన ఎంతో కీలకమని ఆయన అన్నారు. చిన్న లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించాలని సూచించారు. ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నందున వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మార్వో కోరారు. గ్రామాల్లో పరిశుభ్రత పాటించడం ద్వారా అనేక వ్యాధులను ముందుగానే నివారించవచ్చని ఆయన తెలిపారు. అనంతరం పీహెచ్సీ డాక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ, వర్షాకాలంలో జ్వరాలు, వైరల్ ఫీవర్, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశముందని చెప్పారు. జ్వరం వచ్చిన వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి రక్త పరీక్షలు చేయించుకుని చికిత్స పొందాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన పరీక్షలు నిర్వహించి తగిన వైద్యం అందిస్తున్నామని డాక్టర్ తెలిపారు. ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, నిల్వ నీరు ఏర్పడకుండా చూడడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా సీజనల్ వ్యాధులను నివారించవచ్చని ఆయన వివరించారు. ఈ వైద్య శిబిరంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్యుల సలహాలు, సూచనలు పొందారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :