నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మకూరు - డిసెంబర్ 30 : రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలకు వారి విధి నిర్వహణలో వేగవంతంగా పనిచేస్తూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ ప్రభుత్వంపై వారికి మరింత నమ్మకాన్ని కలిగేలా ఉపయోగపదుతుందని నూతన స్మార్ట్ సెల్ ఫోన్లను అంగన్వాడీ కార్యకర్తలకు అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారికి వాటిని తమ ప్రాంతంలో అందించిన మా నేత, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి జిల్లా అంగన్వాడి కార్యకర్తల అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారని తెలిపిన నెల్లూరు జిల్లా తెలుగు నాడు అంగన్వాడి డ్వాక్రా సాధికారిక సంస్థ పార్లమెంటరీ అధ్యక్షురాలు మల్లు స్వాతి రెడ్డి. ఈ సెల్ ఫోన్లను అందించడం ద్వారా ప్రభుత్వం అందించే వివిధ రకాల యాప్లను అప్లోడ్ చేస్తూ అంగన్వాడిల ద్వారా మెరుగైన సేవలను అందించడానికి వీలవుతుందని వీటిని ఉపయోగించే విధానాన్ని కూడా పూర్తిస్థాయిలో తెలుసుకొని మరింతగా అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని వారు ఈ సందర్భంగా తెలిపారు.
Reporter
Namitha News