Wednesday, 17 June 2026 03:06:27 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

విద్యార్థులు ప్రణాళికతో చదివి లక్ష్యాలను అధిగమించాలి - బ్రిలియంట్ కరస్పాండెంట్ మొరుంపల్లి సహదేవరెడ్డి సూచనలు

Date : 20 April 2026 08:33 PM Views : 958

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విద్యార్థులు ప్రణాళికతో చదివి లక్ష్యాలను అధిగమించాలి - బ్రిలియంట్ కరస్పాండెంట్ మొరుంపల్లి సహదేవరెడ్డి సూచనలు - ఘనంగా పాఠశాల 26 వార్షికోత్సవ వేడుకలు మదనపల్లె : విద్యార్థులు ప్రణాళికతో చదివి లక్ష్యాలను అధిగమించాలని పట్టణంలోని బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరస్పాండెంట్ మొరుంపల్లి సహదేవరెడ్డి సూచించారు.రింగ్ రోడ్డులోని శ్రీ చౌడేశ్వరి దేవి కళ్యాణ మండపము నందు పాఠశాల 26వ వార్షికోత్సవ వేడుకలు ఎంతో అట్టహాసంగా జరిగాయి.కరస్పాండెంట్ మొరుంపల్లి సహదేవ రెడ్డి,ప్రధానోపాధ్యాయురాలు మొరుంపల్లి రజనిల ఆధ్వర్యంలో సంబరాలు అంబరాన్నంటాయి.ఈ సందర్భంగా సహదేవరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండి క్రమశిక్షణను అలవర్చుకోవాలన్నారు.ఉన్నత చదువులకు పోయే కొద్దీ ఒక సరైన ప్రణాళికను రూపొందించుకొని ముందుకు సాగితే తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం సులభతరమవుతుందన్నారు.తమ పాఠశాలలో నాణ్యమైన విద్యతోపాటు సామాజిక స్పృహ,దేశభక్తి,క్రీడలు,సాంస్కృతిక కార్యక్రమాలు,యోగ వంటి అంశాలపై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు.సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు ప్రేరణగా నిలవాలన్నారు.చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఉపాధ్యాయులు బోధించే పాఠాలను చక్కగా అలవర్చుకొని,తల్లిదండ్రులు సూచనలు పాటించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు.అదేవిధంగా మంచి ఫలితాలు సాధించి పాఠశాలకు,తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.గత 25 సంవత్సరాలుగా తమ పాఠశాలలో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో స్థిరపడడం గర్వంగా ఉందన్నారు.మా సుదీర్ఘ ప్రయాణంలో పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న తల్లిదండ్రులకు,కృషి చేస్తున్న ఉపాధ్యాయినీ,ఉపాధ్యాయులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.అనంతరం విద్యార్థినీ,విద్యార్థులచే ప్రదర్శించబడిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉర్రూతలూగించాయి.సహదేవ రెడ్డి,రజనిలు అద్భుత నృత్యంతో విద్యార్థుల్లో ఉత్తేజాన్ని నింపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థిని,విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: