నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విద్యార్థులు ప్రణాళికతో చదివి లక్ష్యాలను అధిగమించాలి - బ్రిలియంట్ కరస్పాండెంట్ మొరుంపల్లి సహదేవరెడ్డి సూచనలు - ఘనంగా పాఠశాల 26 వార్షికోత్సవ వేడుకలు మదనపల్లె : విద్యార్థులు ప్రణాళికతో చదివి లక్ష్యాలను అధిగమించాలని పట్టణంలోని బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరస్పాండెంట్ మొరుంపల్లి సహదేవరెడ్డి సూచించారు.రింగ్ రోడ్డులోని శ్రీ చౌడేశ్వరి దేవి కళ్యాణ మండపము నందు పాఠశాల 26వ వార్షికోత్సవ వేడుకలు ఎంతో అట్టహాసంగా జరిగాయి.కరస్పాండెంట్ మొరుంపల్లి సహదేవ రెడ్డి,ప్రధానోపాధ్యాయురాలు మొరుంపల్లి రజనిల ఆధ్వర్యంలో సంబరాలు అంబరాన్నంటాయి.ఈ సందర్భంగా సహదేవరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండి క్రమశిక్షణను అలవర్చుకోవాలన్నారు.ఉన్నత చదువులకు పోయే కొద్దీ ఒక సరైన ప్రణాళికను రూపొందించుకొని ముందుకు సాగితే తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం సులభతరమవుతుందన్నారు.తమ పాఠశాలలో నాణ్యమైన విద్యతోపాటు సామాజిక స్పృహ,దేశభక్తి,క్రీడలు,సాంస్కృతిక కార్యక్రమాలు,యోగ వంటి అంశాలపై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు.సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు ప్రేరణగా నిలవాలన్నారు.చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఉపాధ్యాయులు బోధించే పాఠాలను చక్కగా అలవర్చుకొని,తల్లిదండ్రులు సూచనలు పాటించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు.అదేవిధంగా మంచి ఫలితాలు సాధించి పాఠశాలకు,తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.గత 25 సంవత్సరాలుగా తమ పాఠశాలలో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో స్థిరపడడం గర్వంగా ఉందన్నారు.మా సుదీర్ఘ ప్రయాణంలో పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న తల్లిదండ్రులకు,కృషి చేస్తున్న ఉపాధ్యాయినీ,ఉపాధ్యాయులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.అనంతరం విద్యార్థినీ,విద్యార్థులచే ప్రదర్శించబడిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉర్రూతలూగించాయి.సహదేవ రెడ్డి,రజనిలు అద్భుత నృత్యంతో విద్యార్థుల్లో ఉత్తేజాన్ని నింపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థిని,విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Reporter
Namitha News