నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశ్వం స్కూల్ CBSE లో ఘనంగా సంక్రాంతి వేడుకలు విశ్వం స్కూల్ CBSE విద్యార్థులు మకర సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి అందమైన సంప్రదాయ వస్త్రాల్లో ఉల్లాసంగా పాల్గొని ఎంతో అందంగా మెరిశారు. ఈ పండుగ దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో జరుపుకుంటారని విద్యార్థులు తెలుసుకున్నారు. లోహ్రి, మాఘ్ బిహూ, సంక్రాంతి, పొంగల్, మఘరా విలాకు వంటి పేర్లను పిల్లలు తెలుసుకొని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు . దీనిని ‘పంటల పండుగ’గా ఎందుకు పిలుస్తారో, ప్రతి ఆచారం వెనుక ఉన్న శాస్త్రీయ సాంప్రదాయ కారణాలను కూడా తెలుసుకొని వారు నేర్చుకున్నారు. ధ్యాన్ చంద్, ఏ.పీ.జే, మహాత్మా, నైటింగేల్ ఈ నాలుగు జట్టుల మధ్య నిర్వహించిన పోటీలు మరింత ఉత్సాహాన్ని అందించాయి. మకర సంక్రాంతి సంబరాలను ప్రతిబింబించే అందమైన రంగవల్లులను తయారు చేయడంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఎంతో ఆనందం పొందారు. పిల్లలు గుడిసెలను నిర్మించి, పొంగల్తో పాటు ఇతర వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తూ పూజలు నిర్వహించి ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఉపాధ్యాయులు పండుగ ప్రాధాన్యతను వివరించి, న్యాయనిర్ణేతల బృందాన్ని జట్టుల మధ్యగా తీసుకెళ్లి వివరణ ఇచ్చారు. గాలిపటాల ఎగరేసే పోటీ బాలురకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సృజనాత్మకత, రంగవల్లి, ప్రదర్శన మరియు పొంగల్ రుచులు వంటి విభాగాలలో మార్కులు కేటాయించబడ్డాయి. మహాత్మా గాంధీ జట్టు మొత్తం విజేతగా నిలిచి ట్రోఫీని గెలుచుకోగా, ఏ.పీ.జే. జట్టు రెండో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. జే. రోజ్లిన్ ప్రియ గారు ఇలాంటి కార్యక్రమాల ద్వారా సామరస్యం మరియు కుటుంబ బంధాల ప్రాధాన్యతను పునరుద్ఘాటించారు. ప్రతి ఒక్కరూ పండుగ వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చైర్మన్ శ్రీ ఎం. ప్రభాకర్ రెడ్డి గారు మహాత్మా జట్టును అభినందించడంతో పాటు, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన ప్రిన్సిపాల్ ను మరియు సిబ్బంది మొత్తం బృందానికి శుభాకాంక్షలు తెలిపారు ఇంకా విద్యార్థులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
Reporter
Namitha News