నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 28 : తంబళ్లపల్లె నియోజకవర్గం కేంద్రం క్రాస్ రోడ్ లో నిలువెత్తు గొయ్యి తవ్వి కనీసం ప్రమాద సూచిక బోర్డు లేకుండా వదిలేశారు. క్రాస్ రోడ్లో తంబళ్లపల్లి - మదనపల్లి - ములకలచెరువు ప్రధాన రహదారి కూడలి రోడ్డు ప్రక్కన టీ స్టాల్ ఎదురుగా సుమారు ఆరడుగుల గొయ్యి తవ్వారు. మంగళవారం ఉదయం నుండి వందలాదిమంది టీ స్టాల్, పానీయాల దుకాణం, సెల్ షాప్ లకు ఈ గొయ్యి దాటి వెళుతున్నారు. ప్రమాదవశాత్తు ఏమరపాటున కాలు వేస్తే ఆరడుగుల గొయ్యి లో పడితే అంతే గతి. రాత్రిపూట ఏం జరుగుతుందో ఆ దేవునికి ఎరుక ఈ గొయ్యి ఏ శాఖ సిబ్బంది తవ్వారో చెప్పే నాదుడే లేడు. పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి ఈ గొయ్యి వద్ద ప్రమాద సూచిక బోర్డు ఏర్పాటు చేయకపోతే ప్రమాదాలు జరగక తప్పదు
Reporter
Namitha News