Tuesday, 09 June 2026 09:38:18 AM
# శివ మాల దారణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి # స్పేషియల్ కంప్యూటింగ్ భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి పునాది – డాక్టర్ మల్లేశం దాసరి # రాష్ట్రం కూటమి పాలనతోనే అభివృద్ధి వైపు పరుగులు - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి # పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం - ఇరిగేషన్ ఎస్.ఈ. వెంకట్రామయ్య # ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ # మదనపల్లి లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగ # తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు

అకడమిక్ నుండీ పరిశ్రమ వరకూ అనే అంశం అతిధి ఉపన్యాసం

Date : 16 February 2026 10:32 PM Views : 251

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఫిబ్రవరి 16 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మరియు స్కిల్ డెవలప్మెంట్ సెల్ విభాగం వారు మిట్స్ ఐ.ఈ.టీ.ఈ స్టూడెంట్ చాప్టర్ వారి సహకారంతో వీ.ఎల్‌.ఎస్‌.ఐ మరియు ఎలక్ట్రోమాగ్నెటిక్ అకాడెమిక్ నుండి పరిశ్రమ వరకు ప్రయాణం” అనే అంశంపై అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బెంగళూరు కు చెందిన క్వాల్‌కామ్ కంపెనీ సీనియర్ లీడ్ ఇంజనీర్, అభిషేక్ కుమార్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో సెమీకండక్టర్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది అని, అనేక జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థలు చిప్ డిజైన్ కేంద్రాలను స్థాపించడం ద్వారా వీ.ఎల్‌.ఎస్‌.ఐ చిప్ డిజైన్ రంగంలో శిక్షణ పొందిన ఈసీఈ విద్యార్థులకు అధిక ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. అకాడెమిక్ స్థాయిలో అభ్యసించే సి.మాస్ సెమీకండక్టర్ సాంకేతికత, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ తయారీ ప్రక్రియ, మ్యాక్స్‌వెల్ సమీకరణాలు, ప్రసార రేఖలు మరియు తరంగ ప్రసరణ వంటి ప్రాథమిక అంశాలు పరిశ్రమలో ఎంత ముఖ్యమో వివరించారు. విద్యుత్ క్షేత్రం మరియు అయస్కాంత క్షేత్రం ప్రయాణించే తరంగాలు ద్వారా యాంటెన్నా రూపకల్పన వంటి ప్రాజెక్టులపై ప్రయోగాత్మక అనుభవం పెంపొందించుకోవచ్చని తెలిపారు. రేడియో ఫ్రీక్వెన్సీ మరియు మైక్రోవేవ్ రూపకల్పన, చిప్ ధృవీకరణ వంటి ఆధునిక రంగాల్లో నైపుణ్యాభివృద్ధి ద్వారా మెరుగైన కెరీర్ అవకాశాలు సాధ్యమవుతాయని అన్నారు. చిప్ డిజైన్ నైపుణ్యం కలిగిన ఇంజినీర్లకు పరిశ్రమల్లో విస్తృత ఉద్యోగ అవకాశాలు ఉండటంతో పాటు, భవిష్యత్తు సాంకేతిక అభివృద్ధిలో ఇవి మరింత కీలకంగా మారనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఎస్.రాజశేఖరన్, కోఆర్డినేటర్ వి.ఎస్ ప్రశాంత్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :