నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 18 : మహిళా సంఘాలు రుణ సౌకర్యం పొంది ఆర్థిక అభివృద్ధి సాధనకు సంఘమిత్రలు కేంద్ర బిందువులుగా నిలవాలని డి ఆర్ డి ఏ, పీడి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. గురువారం తంబళ్లపల్లె, కురబలకోట, పెద్దమండెం మండలాల సంఘమిత్రల సమావేశం జరిగింది. నేడు మహిళా సంఘాలు అన్ని రంగాలుగా అభివృద్ధి బాట పట్టడానికి పునాదులు మీరేనని భవిష్యత్తులో మీ కృషి పట్టుదలతో మరింత అభివృద్ధికి దశ దిశ గా మీరే అండగా నిలవాలని సూచించారు. ప్రభుత్వ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మహిళా సంఘాల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలన్నారు. ప్రతి మహిళ ఆర్థికంగా, సామాజికంగా పురోగతి సాధించి ప్రతి కుటుంబం ప్రభుత్వం ఆశించిన స్వర్ణాంధ్రకు నిలువుటద్దంగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంలు గంగాధర్, డైరీ ఏపిఎం సుజాత, శ్రీనివాసులు, నరసింహులు సీసీలు కత్తి నరసింహులు, రమణ, ఆదిలక్ష్మి, భాష మూడు మండలాల సంఘమిత్రలు పాల్గొన్నారు.
Reporter
Namitha News