Tuesday, 09 June 2026 09:42:31 AM
# శివ మాల దారణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి # స్పేషియల్ కంప్యూటింగ్ భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి పునాది – డాక్టర్ మల్లేశం దాసరి # రాష్ట్రం కూటమి పాలనతోనే అభివృద్ధి వైపు పరుగులు - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి # పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం - ఇరిగేషన్ ఎస్.ఈ. వెంకట్రామయ్య # ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ # మదనపల్లి లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగ # తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు

పోలీసులకు ఆయుధ నైపుణ్యం తప్పనిసరి - ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

ఫైరింగ్ రేంజ్ పాల్గొన్న ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

Date : 06 February 2026 08:02 PM Views : 121

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - ఫిబ్రవరి 06 : రాయచోటి పోలీసు పరేడ్ మైదానంలో ఏఆర్ సిబ్బందికి వృత్తి నైపుణ్య పరీక్షలు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు ఆయుధమే కవచమని, దాని వినియోగంపై ప్రతి ఒక్కరికీ తిరుగులేని పట్టు ఉండాలని, అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్పష్టం చేశారు. శుక్రవారం కడప శివార్లలోని ఫైరింగ్ రేంజ్‌లో నిర్వహించిన ఏఆర్ ‘మొబిలైజేషన్’ శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేవలం ఆదేశాలు ఇవ్వడమే కాకుండా, క్షేత్రస్థాయిలో సిబ్బందికి ఆదర్శంగా నిలిచారు ఎస్పీ గారు. స్వయంగా రంగంలోకి దిగి ఏకే-47, ఎస్ఎల్ఆర్, మరియు అత్యాధునిక గ్లాక్ పిస్టల్‌తో లక్ష్యాన్ని గురి తప్పకుండా ఛేదించి అందరినీ అశ్చర్యపరిచారు. ఎస్పీ గారి ఫైరింగ్ ప్రతిభను చూసి అక్కడి సిబ్బంది ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. ఆయుధాన్ని వాడటం అంటే కేవలం కాల్చడం మాత్రమే కాదు, అత్యవసర సమయాల్లో ఎంత వేగంగా స్పందిస్తామనేదే ముఖ్యమని ఆయన ఈ సందర్భంగా వివరించారు. అనంతరం ఎస్పీ గారి ఆదేశాల మేరకు, రాయచోటి పోలీస్ పరేడ్ మైదానంలో ఏఆర్ సిబ్బందికి ప్రత్యేక వృత్తి నైపుణ్య పరీక్షలు నిర్వహించారు. ఏఆర్ డిఎస్పీ ఏడుకొండల రెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో స్క్వాడ్ డ్రిల్, ఆమ్స్ డ్రిల్, లాఠీ డ్రిల్ తో సిబ్బంది చురుకుదనాన్ని పరిశీలించారు. అత్యాధునిక ఆయుధాలను అతి తక్కువ సమయంలో విడదీయడం, తిరిగి అమర్చడం వంటి అంశాల్లో పరీక్షలు నిర్వహించారు. విధి నిర్వహణలో ఒత్తిడిని జయించేందుకు శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించారు

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణే మన ప్రథమ కర్తవ్యం. ఆయుధాలపై పూర్తి పరిజ్ఞానం ఉన్నప్పుడే విధి నిర్వహణలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిరంతర సాధన ద్వారానే వృత్తిపరమైన మెళకువలు సొంతమవుతాయి" అని ఎస్పీ గారు పేర్కొన్నారు. ప్రతిభ కనబరిచిన పోలీసులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి గారు, మదనపల్లి డీఎస్పీ ఎస్.మహేంద్ర గారు, రాయచోటి డిఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్ గారు, ఏఆర్ డిఎస్పీ డి. ఏడుకొండల రెడ్డి గారు మరియు ఇతర పోలీసు అధికారులు, ఏఆర్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :