నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 3 ః తంబళ్లపల్లె మండల ఎస్.టి.యు. ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడిగా ఏ.అసనుల్లా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా నాయకులు వై.సాంబశివ తెలిపారు. బుధవారం ఆయన ఆధ్వర్యంలో జరిగిన మండల ఎస్.టి.యు ఎన్నికలలో అధ్యక్షుడుగా యసనుల్లా, గౌరవ అధ్యక్షుడిగా పి. సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా డి.వెంకట నరసప్ప, కోశాధికారిగా డి.పవన్ కుమార్ రెడ్డి, సి.పి.ఎస్ కార్యదర్శిగా ఎస్.నాగరాజు, ఉపాధ్యక్షులుగా డి.వెంకట్ కుమార్, యుగంధర్, మహిళా కార్యదర్శిగా ఎం.పద్మారాణి, జిల్లా సభ్యులుగా ఆర్.రమేష్ రెడ్డి, వై.సాంబశివ, డి. కృష్ణయ్య, ఎం.వెంకటరమణ, జి.చంద్రశేఖర్, కె.రెడ్డెప్పరెడ్డి, సి.ఈశ్వర్ రెడ్డి, డి.మోహన్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని నూతన కార్యవర్గం చేత జిల్లా నాయకుడు వై.సాంబశివ ప్రమాణం చేశారు.
Reporter
Namitha News