Thursday, 30 July 2026 11:21:21 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ప్రధానమంత్రి గ్రామీణ రహదారి పథకం పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

దిగువ గొల్లపల్లి లో చామంతి పూల తోటను పరిశీలించిన కలెక్టర్

Date : 28 February 2026 09:03 PM Views : 228

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సదుం/ సోమల - ఫిబ్రవరి 28 : శనివారం ఉదయం సదుం, సోమల మండలాలలో ప్రధానమంత్రి గ్రామీణ రహదారి పథకం పనులను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రామీణ ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి గ్రామాలను పట్టణాలతో అనుసంధానం చేయడానికి ప్రధానమంత్రి గ్రామీణ రహదారి పథకం కింద చేపడుతున్న పనులలో భాగంగా పుంగనూరు నియోజకవర్గంలోని సదుం మండలంలోని T17- పి పి సి రోడ్డు నుండి పి పి సి రోడ్డు వరకు పొట్టెంవాయిపల్లె తిమ్మనాయని పల్లె ద్వారా పొడవు 0.00 కి. మీ నుండి 9.97కి. మీ వరకు జి ఎస్ బి మరియు డబ్ల్యూ ఎం ఎం పూర్తయిన పనులను మరియు సోమల మండలంలో కలికిరి రోడ్డు నుండి నిమ్మనపల్లె మండల సరిహద్దు కందూరు వరకు 8.00 కి. మీ నుండి 15.38 కి. మీ వరకు పూర్తయిన పనులను స్వయంగా పరిశీలించారు. ప్రధానమంత్రి గ్రామీణ రహదారి పథకం కార్యక్రమంలో పూర్తి చేయాల్సిన పనులను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తిచేయాలని ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగేలా నిర్మాణంలో ఎటువంటి లోపాలు ఉండకూడదని, ప్రతి దశలో సాంకేతిక ప్రమాణాలు పాటించాల్సిన బాధ్యత అధికారులదేనని తెలిపారు. సదుం మండలం, చింతపర్తి వారి గ్రామపంచాయతీ పరిధిలోని దిగువ గొల్లపల్లి సమీపంలోని రైతు గంగిరెడ్డి సాగు చేస్తున్న చామంతి పూల తోటను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పంట సాగు విధానం, దిగుబడి, పండించిన పూలను స్థానిక మార్కెట్లతో పాటు సమీప పట్టణాలకు విక్రయిస్తున్నట్లు రైతు కలెక్టర్కు వివరించారు. పూలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో రైతులు ఆధునిక సాగు పద్ధతులు అవలంబించాలని కలెక్టర్ సూచించారు. వ్యవసాయంలో వైవిధ్యీకరణ ద్వారా రైతుల ఆదాయం పెంపు ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ, ఉద్యాన పంటల సాగుపై మరింత దృష్టి రైతులు సారించాలని అవసరమైన సాంకేతిక సలహాలు, ఉద్యానవన శాఖ ద్వారా సహాయం అందిస్తామని రైతుకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమాలలో ప్రాజెక్టు అమలు విభాగం ఏఈఈ ప్రవళిక, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: