Friday, 31 July 2026 02:31:50 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

గుండ్లపల్లి రైతుల ప్రకృతి వ్యవసాయం జిల్లాకే ఆదర్శం - పోర్డు డైరెక్టర్ లలితమ్మ

Date : 20 January 2026 11:00 PM Views : 209

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : తంబళ్లపల్లె - జనవరి 20 :ః తంబళ్లపల్లె మండలం గుండ్లపల్లి పంచాయతీలో ల్యాండ్ డెవలప్మెంట్ తో వ్యవసాయానికి అనువుగా మార్చుకొని అందులో ప్రకృతి వ్యవసాయ పంటలు పండిస్తున్న రైతులు జిల్లాకే ఆదర్శంగా నిలిచినట్లు పోర్డు డైరెక్టర్ లలితమ్మ కొనియాడారు. మంగళవారం ఆమె గుండ్లపల్లి పంచాయతీలో ల్యాండ్ డెవలప్మెంట్లో అభివృద్ధి చేసిన పొలాలలో ప్రకృతి వ్యవసాయంతో పండించిన వేరుశనగ, ఉలవ, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. సేంద్రియ కషాయాలతో పండ్లతోటలైన మామిడి, టమోటా, కూరగాయల పంటలు పండించడం పై వారిని అభినందించారు. రైతులు మాట్లాడుతూ ఫోర్డ్ సంస్థ సహకారంతో ల్యాండ్ డెవలప్మెంట్లో మా భూములు చదునుతో పాటు పొలాలకు రోడ్లు చేసుకుని అందులో ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలు నాణ్యమైన దిగుబడి, ప్రకృతి కషాయాలతో టమోటా,మామిడి పంటలు ఎలాంటి రోగాలు లేని పూత పూసినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రకృతి పంటలైన సజ్జలు, జొన్నలు, రాగులు, కొర్రలు, సామలు సాగు చేస్తామన్నారు.ప్రొద్దుటూరు, చెన్నే కొత్తపల్లి లో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పొంది వారికి దీటుగా ప్రకృతి వ్యవసాయమే లక్ష్యంగా పంటలు సాగు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం పై దృష్టి సారించి భవిష్యత్తులో మానవాళికి ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రకృతి వ్యవసాయం అవలంబించాలని లలితమ్మ కోరారు. ఆమె వెంట సిబ్బంది రమణ, రైతులు వేట మల్లికార్జున, నరసింహప్ప నాయుడు, లక్ష్మయ్య సిద్ధప్ప తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :