నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 17 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంలో పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, రాష్ట్ర టిడిపి కార్యదర్శి మద్ది రెడ్డి కొండ్రెడ్డి, టిడిపి నాయకుల భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. క్రాస్ రోడ్ లో గురువారం రాత్రి పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, రాష్ట్ర టిడిపి కన్వీనర్ మద్దిరెడ్డి కొండ్రెడ్డిల ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించి వేశారు. ఈ విషయమై శుక్రవారం రాష్ట్ర టిడిపి కార్యదర్శి కొండ్రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఫ్లెక్సీలను ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కార్యకర్తలతో క్రాస్ రోడ్ లో వాహనాల అడ్డం పెట్టి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఉదయం ఫ్లెక్సీల చించివేత తెలుసుకున్న పలు మండలాల నుండి స్వచ్ఛందంగా వాహనాలలో టిడిపి నాయకులు, కార్యకర్తలు కొండ్రెడ్డి స్వగృహం చేరుకొన్నారు. అక్కడి నుండి కొండ్రెడ్డి టిడిపి కార్యకర్తలతో ర్యాలీగా పాత బస్టాండ్ మీదుగా క్రాస్ రోడ్డు చేరుకొని మొలకలచెరువు క్రాస్ రోడ్డుకు అడ్డంగా ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ జిందాబాద్, కొండ్రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, ఫ్లెక్సీలుచించిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలి నినాదాలతో హోరెత్తించారు. ప్రధాన రహదారిలో ధర్నా జరుగుతుండడంతో ఆర్టీసీ సర్వీసులు, వాహనాలతో పాటు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ సందర్భంగా కొండ్రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుని హక్కు ప్రతి ఒక్కరికి ఉందని మా ఫ్లెక్సీలు చించివేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎవరైనా దమ్ముంటే ధైర్యంగా ఎదుర్కోవాలని ఫ్లెక్సీల మీద ప్రతాపం చూపడం పిరికి బంధ చర్యగా అభివర్ణించారు. ఫ్లెక్సీలు చించిన వారిని అరెస్టు చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పోలీసులు రంగ ప్రవేశం చేసి సర్ది చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.ఈ ఆందోళన కార్యక్రమాల్లో నియోజకవర్గం లోని ఆరు మండలాల టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News