Wednesday, 17 June 2026 02:57:26 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

కోసువారి పల్లెలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుడిగాలి పర్యటన

Date : 22 April 2026 08:58 PM Views : 327

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 22 : తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లె పంచాయతీలో బుధవారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ఉదయం తంబళ్లపల్లె లోని ఆయన స్వగృహం నుండి కోసువారిపల్లి పంచాయతీ తరుగువారిపల్లిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సోమశేఖర్ రెడ్డి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొని వారి ఆతిథ్యం స్వీకరించి ఆకుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సోమశేఖర్ రెడ్డి కుటుంబం ఎమ్మెల్యే కి సాదర స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అదే గ్రామంలో అనారోగ్యంతో తీవ్ర అస్వస్థత గురై కాలు పోగొట్టుకున్న శేఖర్ రెడ్డిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆ కుటుంబ సభ్యులను ఓదార్చి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తదుపరి కోసువారి పల్లెకు చెందిన మాజీ మల్లయ్య కొండ ఆలయ కమిటీ మెంబర్ మిల్ట్రీ రెడ్డప్ప రెడ్డి సతీమణి అనారోగ్యం బారినపడిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రెడ్డప్పరెడ్డి ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించి మెరుగైన చికిత్సలు చేయించాలని సూచించారు. రెడ్డప్పరెడ్డికి నీకు మీ కుటుంబానికి నేను అండగా ఉంటానని ధైర్యం నూరిపోశారు. అనంతరం కార్యకర్తలతో మాట్లాడుతూ కార్యకర్తలు ఎవరు అధైర్య పడాల్సిన పనిలేదని ముందు ముందు మంచి రోజులు వస్తాయని పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచించారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురావాలని వారికి హామీ ఇచ్చారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు చౌడేశ్వర, కిషోర్ కుమార్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు రాజారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ కృష్ణారెడ్డి, బొట్టు శంకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి,చక్రపాణి, బావ జాన్, శంకర్ రెడ్డి, కృష్ణారెడ్డి, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: