నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 05 : తంబళ్లపల్లె మండల కేంద్రంలోని ఎరువుల దుకాణదారులు ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తనాలు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని పీలేరు వ్యవసాయ శాఖ ఏడిఈ రమణరావు హెచ్చరించారు. శుక్రవారం ఆయన ఏవో రమణకుమార్ తో కలసి మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరువుల దుకాణాలలో అమ్మకాలు, కొనకాల రిజిస్టర్లు, ప్రస్తుత నిల్వ,తూనికల మిషన్లు పరిశీలించారు. దుకాణాలలో అమ్ముతున్న ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తనాలు అమ్మకాల పై స్థానిక రైతులను, వినియోగదారులను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఏవో రమణ కుమార్ మాట్లాడుతూ మండలంలోని రబీ రైతులకు వేరుశెనగ విత్తన కాయలు ఎన్ని కావాలన్నా సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రైతన్నా.. మీకోసం కార్యక్రమం ద్వారా అవగాహన పొంది రైతులు పంట మార్పిడి, ఆరుతడి పంటలు, ప్రకృతి వ్యవసాయం పై దృష్టి సారించాలని సూచించారు. వారి వెంట గ్రామ వ్యవసాయ అధికారులు లు సురేష్, సుధాకర్, రెడ్డి శేఖర్, కావ్య తదితరులు ఉన్నారు.
Reporter
Namitha News