Thursday, 30 July 2026 04:02:34 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో నిర్దేశించిన లక్ష్యాల ను పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సేవలందించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

Date : 08 January 2026 08:43 PM Views : 309

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జనవరి 08 : కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల అమలులో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని, ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం మదనపల్లి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలపై... పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ, సాంఘిక, వెనుకబడిన తరగతుల సంక్షేమ, గిరిజన సంక్షేమ, ఐసిడిఎస్ తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలలో పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో... పింఛన్ల పంపిణీ, గ్రామపంచాయతీ సేవలు, ఆర్టీసీ సేవలు, రిజిస్ట్రేషన్ సేవలు, తదితర సేవలపై ప్రజల నుండి తీసుకున్న అభిప్రాయాలు, ఎం ఎస్ ఎం ఈ పార్కుల ఏర్పాటు తదితర అంశాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించగా మదనపల్లె కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.... ప్రజలకు సంతృప్తి కరస్థాయిలో సేవలు అందించాలని ప్రజల నుంచి తీసుకున్న అభిప్రాయాలను సమీక్షించుకొని నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఎమ్మెస్ ఎంఈ పార్కుల ఏర్పాటులో భూ సమీకరణ పెండింగ్లో ఉంటే వెంటనే దానిపై తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :