నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 12 ః తంబళ్లపల్లె మండలంలో హనుమజ్జయంతి ఉత్సవాలు హిందూ సోదరులు, ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్, కురవపల్లి, ముట్రవారిపల్లె, మరిమిరెడ్డిపల్లి, కోటకొండ, కుక్క రాజు పల్లి, గుండ్లపల్లి, గోపి దీన్ని కొత్తపల్లి, కొట్టాల, మూలపల్లి ఆంజనేయస్వామి ఆలయాలలో ఆంజనేయ స్వామి, శ్రీరామ భక్తులు, ప్రజలు స్వామివారికి ఆకు పూజ తో పాటు ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా జై హనుమాన్, జైశ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. పలుచోట్ల అన్నదానాలు, శ్రీరామ సంకీర్తనలు, చెక్క భజనలు, కోలాటాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు
Reporter
Namitha News