Friday, 31 July 2026 07:34:35 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

ఉపాధి సిబ్బంది పనితీరు మార్చుకోవాలి - పీడి వెంకటరత్నం

Date : 30 March 2026 08:33 PM Views : 245

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఉపాధి హామీ రికార్డులను సక్రమంగా నిర్వహించాలి: -- ఉపాధి సిబ్బంది పనితీరు మార్చుకోవాలి -- పనిలో అలసత్వం వహిస్తే చర్యలు -- డ్వామా పీడి వెంకటరత్నం నిమ్మనపల్లి: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, ఉద్యోగులు పొరపాటులను సరిదిద్దుకొని క్రమశిక్షణతో పని చేయాలని డ్వామా పీడి వెంకటరత్నం తెలిపారు. ఆదివారం డ్రామా ఏపిడి శ్రీనివాసులు, ఎంపీడీఓ ఫక్రుద్దీన్ సాహెబ్, జిల్లా ఆంబూడ్స్ మెన్ శ్రీనివాసులు తో కలసి స్థానిక ఉపాధి హామీ భవనం ఆవరణంలో 2024-25 సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మండల వ్యాప్తంగా వివిధ శాఖలలో 865 పనులకు రూ.4,80,28,346/- కోట్ల లను ఖర్చు చేసిన దానిపై 19వ సామాజిక తనిఖీ బహిరంగ ప్రజా వేదిక సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా డ్వామా పీడి వెంకటరత్నం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2024-25 లో ఎంజిఎన్ఆర్ఈజీఎస్ ద్వారా 802 పనులకు రూ.3,10,88,072/- లతో చేసిన ఉపాధి హామీ పనులను, ఎంజిఎన్ఆర్ఇజిఎస్ ద్వారా పంచాయతీరాజ్ శాఖలో 63 పనులకు రూ.1,69,40,274/- లతో చేసిన పనులను మొత్తంగా 865 పనులకు రూ.4,80,28,346/- లతో చేసిన పనులను సామాజిక తనిఖీ బృందం ప్రతి పంచాయతీలోనూ ప్రతి పనిని క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించి వాటిలోని లోపాలను గుర్తించడం జరిగిందన్నారు. అనంతరం స్థానిక పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఇంజనీరింగ్ సహాయకులు, ఉపాధి హామీ సిబ్బంది, రైతులతో కలసి సామాజిక తనిఖీ బృందం ప్రతి పంచాయతీలోనూ గ్రామ సభను ఏర్పాటు చేసి పరిశీలించిన పనుల స్థితిగతులను ప్రజలతో చర్చించడం జరిగిందన్నారు. దీనిపై ఆదివారం సామాజిక తనిఖీ ప్రజావేదికను ఏర్పాటు చేసి బహిరంగంగా ప్రజలకు వివరించామన్నారు. ఇందులో ఉపాధి హామీ క్షేత్రస్థాయి సిబ్బందిలో, టెక్నికల్ అసిస్టెంట్ ల నిర్లక్ష్యం కారణంగా కొన్ని లోపాలను గుర్తించినట్లు వివరించారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేసిన పనులలో, తనిఖీ బృందం గుర్తించిన పనులలో తేడాలను గుర్తించామన్నారు. పనుల గుర్తింపు, పనుల ప్రారంభం, పని పూర్తి, వేతనాలు చెల్లింపు లకు సంబంధించిన రికార్డులు సక్రమంగా లేవని అన్నారు. కొన్ని పంచాయతీలలో ఉద్యానవన పంటల సాగులో చేపట్టిన పనులకు గుంతలు తీసి మొక్కలను నాటకుండా ఉండటాన్ని, నాటిన మొక్కలను సంరక్షించకుండా వదిలివేయడాన్ని గుర్తించారన్నారు. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను వెంటనే నాటించాలని ఆదేశించామన్నారు. రూ.16,500/- లను పెనాల్టీ గా వేసినట్లు తెలిపారు. టెక్నికల్ అసిస్టెంట్, ఇతర సిబ్బంది క్రమశిక్షణ రహితంగా ఉన్నారని, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ఉపాధి హామీ సిబ్బందికి వారి విధులపై కనీసం అవగాహన లేకపోవడంతో ఆగ్రహించి సిబ్బంది పనితీరు మార్చుకోవాలని లేనిపక్షంలో తాము తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారి పనితీరు మెరుగుపరుచుకునేలా చర్యలు తీసుకోవాలని ఏపీఓ రమేష్ కు సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం వహించవద్దని, పొరపాట్లు పునరావృతం కాకుండా సరిదిద్దుకోవాలని ఉపాధి హామీ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపిడి శ్రీనివాసులు, ఎంపిడిఓ ఫక్రుద్దీన్ సాహెబ్, ఏపీఓ రమేష్, ఎస్ఆర్పి సూర్యచక్రం, డిఆర్పీలు దిలీప్ కుమార్, ప్రతాప్, రాజు నాయక్, జేఈ బోయకొండప్ప, టిఏ లు పద్మావతి, ఉపాధి హామీ పథకం క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: