నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 25 : స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న స్ఫూర్తితో ప్రతి వడ్డెర కులస్తుడు తమ హక్కులు కాపాడుకోవడానికి కలిసి రావాలని వడ్డెర సంఘ అధ్యక్షుడు రేపన మల్లికార్జున పిలుపునిచ్చారు. ఆదివారం వడ్డెర సంఘ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా వడ్డెర సంఘం అన్ని రంగాలలో వెనుకబాటుతనం తో మగ్గిపోతున్నారని భావితరాల భవిష్యత్తు కోసం వడ్డెర్లు ఐక్యం కావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. గ్రామస్థాయి నుండి వడ్డెర సంఘం ఏర్పాటు చేసి కమిటీ ఎన్నికలు నిర్వహించి తద్వారా వడ్డెర సౌకర్యాలపై పోరాటం సాగిద్దాం అన్నారు. వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలని, వడ్డెర వృత్తిదారులకు పనిముట్లు, సంక్షేమ పథకాల తోపాటు వడ్డెర కమ్యూనిటీ భవనం నిర్మాణం తోపాటు వడ్డెర జాతి ఆశాజ్యోతి వడ్డే ఓపెన్ విగ్రహం ఏర్పాటుకు కృషి చేద్దామన్నారు. వడ్డెర సంఘం ఏర్పాటుకు వడ్డెర్లు విరివిగా విరాళాలు ఇచ్చి ఐక్యత చాటుకోవాలన్నారు. ఓబన్న విగ్రహం ఏర్పాటు స్థలం కోసం జిల్లా కలెక్టర్ మరియు పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి అధికారులు కలిసి వినతి పత్రాలు ఇవ్వడానికి ప్రతి వడ్డెర కులస్తుడు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పల్లపు శివకేశవ, మహిళా నాయకురాలు రామ లక్ష్మమ్మ, డేరంగుల మనోహర్, తేపల్లె రెడ్డప్ప, డి వేమనారాయణ, ఒలిపి రవికుమార్, వెంకటాచలపతి, దేవరింటి సామి రెడ్డి, పల్లపు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News